అత్యంత ప్రతిష్ట గా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేసిన రాజగోపాల్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రైతులను నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్క తేలుతుంది కదా అంటు రైతులనే ప్రశ్నించారు. ఒకవైపు కేసీయార్ ఏమో ఎక్కడ మాట్లాడినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటమంటే రైతులకు ఉరివేసినట్లే అని పదే పదే చెబుతున్నారు.
మోటార్లకు మీటర్లు బిగించాలన్న కేంద్ర నిబంధంనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్ల బిగుంపును వ్యతిరేకిస్తున్నట్లే మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఏదో అయిపోతుందనే ఆందోళన రైతుల్లో కూడా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రాజగోపాల్ రైతులను ప్రశ్నించారు.
అంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాల్సిందే అన్నట్లుగా బీజేపీ అభ్యర్ధి మాటలున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటం తప్పదు అని మాజీ ఎంఎల్ఏ రైతులను హెచ్చరిస్తున్నట్లే ఉంది. ఎప్పుడైతే మోటార్లకు మీటర్లకు మద్దతుగా రాజగోపాల్ మాట్లాడారో వెంటనే కమలనాథుల్లో ఆందోళన మొదలైపోయింది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు బిగించటమనే విషయం వివాదాస్పద మైపోయింది.
దీని కారణంగానే ఒకపుడు గట్టిగా పట్టుబట్టిన కేంద్రం ఇపుడు పెద్దగా పట్టించుకోవటంలేదు. నిజానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటంలో తప్పేలేదు. కేంద్రం చెప్పిందేమంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చుకోవటం రాష్ట్రాల ఇష్టమని. అయితే ఉచిత విద్యుత్ లో కూడా ఎవరెంత వాడుతున్నారో లెక్కలు తేలాలంటే ప్రతి మోటారుకు మీటరుంటే కానీ లెక్కలు తేలదని చెప్పింది. దీన్నే కొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మరిపుడు రాజగోపాల్ వాదన జనాల్లోకి వెళ్ళిపోయింది. మరి రేపటి ఉపఎన్నికలో ప్రభావం ఎలాగుంటందో చూడాలి.
This post was last modified on September 24, 2022 5:59 pm
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…