విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. మూడు రోజుల కిందట.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్.. వైద్య రంగానికి ఎన్నో చేశారని.. ఆయన సేవలకు సరైన గుర్తింపు రాలేదని.. ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే.. ఎన్టీఆర్ పేరు మార్చి.. వైఎస్సార్.. హెల్త్ యూనివర్సిటీగా పేరు పెడుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే..తనకు ఎనలేని అభిమానమన్నారు.
అంతేకాదు.. చంద్రబాబు కన్నా.. కూడా తనకే ఎన్టీఆర్ అంటే.. అమితమైన గౌరవం ఉన్నాయని.. అందుకే ఏకంగా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని సీఎం జగన్ చెప్పారు. అయితే.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సహా అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబం కూడా.. స్పందించి..జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే.. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సహా.. ఇతర కుటుంబ సభ్యులు కూడా విరుచుకుపడ్డారు.
మరోసారి.. బాలయ్య తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై మండిపడిన ఆయన.. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్ అని తెలిపారు. తండ్రి(వైఎస్) గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చారని, కుమారుడు(జగన్) గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలయ్య వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. అంటూ.. ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చి.. ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని పరోక్షంగా బాలయ్య దుయ్యబట్టారు.
This post was last modified on September 24, 2022 11:26 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…