Political News

మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్టేనా ?

తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.

సోదాల వ్యవహారం మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో మొదలైంది. కేసీయార్ కుటుంబసభ్యులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ కుటుంబంలోని ప్రముఖులకు అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వారిపై ఈడీ వరసగా సోదాలు చేస్తోంది. ఎలాగైనా కేసీయార్ కుటుంబంలోని కీలక వ్యక్తులను ఫిక్స్ చేయటమే ఈడీ టార్గెట్ గా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే పదే పదే సోదాలు జరుగుతున్నాయి.

సోదాల్లో భాగంగా ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, అనేకమంది నేతల వ్యక్తిగత ఆదాయ వివరాలు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు దగ్గర దొరికాయట. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ టార్గెట్ రీచయ్యేంతవరకు ఈడీ సోదాలు చేస్తునే ఉంటుందని అర్దమవుతోంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేషనల్ హెరాల్డ్ మీడియా ముసుగులోను దాని అనుబంధ సంస్ధల వ్యవహారాల్లో విచారణకు హాజరు కావాలని షబ్బీర్ ఆలీ, రేణుకాచౌదరి, గీతారెడ్డి లాంటి సీనియర్లకు నోటీసులిచ్చింది. విచారణ పేరుతో తమచుట్టూ ఈడీ ఎన్నిసార్లు తిప్పించుకున్నా అడిగేవారే లేరు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికే కారణమని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కష్టమట. దాంతో ఎలాగైనా గెలవాలన్న ప్లాన్ తోనే ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యిందనే ఆరోపణలు పెరిగిపోతోంది.

This post was last modified on September 24, 2022 10:27 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

4 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

6 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

7 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

7 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

8 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

8 hours ago