తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.
సోదాల వ్యవహారం మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో మొదలైంది. కేసీయార్ కుటుంబసభ్యులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ కుటుంబంలోని ప్రముఖులకు అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వారిపై ఈడీ వరసగా సోదాలు చేస్తోంది. ఎలాగైనా కేసీయార్ కుటుంబంలోని కీలక వ్యక్తులను ఫిక్స్ చేయటమే ఈడీ టార్గెట్ గా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే పదే పదే సోదాలు జరుగుతున్నాయి.
సోదాల్లో భాగంగా ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, అనేకమంది నేతల వ్యక్తిగత ఆదాయ వివరాలు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు దగ్గర దొరికాయట. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ టార్గెట్ రీచయ్యేంతవరకు ఈడీ సోదాలు చేస్తునే ఉంటుందని అర్దమవుతోంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేషనల్ హెరాల్డ్ మీడియా ముసుగులోను దాని అనుబంధ సంస్ధల వ్యవహారాల్లో విచారణకు హాజరు కావాలని షబ్బీర్ ఆలీ, రేణుకాచౌదరి, గీతారెడ్డి లాంటి సీనియర్లకు నోటీసులిచ్చింది. విచారణ పేరుతో తమచుట్టూ ఈడీ ఎన్నిసార్లు తిప్పించుకున్నా అడిగేవారే లేరు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికే కారణమని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కష్టమట. దాంతో ఎలాగైనా గెలవాలన్న ప్లాన్ తోనే ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యిందనే ఆరోపణలు పెరిగిపోతోంది.
This post was last modified on September 24, 2022 10:27 am
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…