తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.
సోదాల వ్యవహారం మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో మొదలైంది. కేసీయార్ కుటుంబసభ్యులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ కుటుంబంలోని ప్రముఖులకు అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వారిపై ఈడీ వరసగా సోదాలు చేస్తోంది. ఎలాగైనా కేసీయార్ కుటుంబంలోని కీలక వ్యక్తులను ఫిక్స్ చేయటమే ఈడీ టార్గెట్ గా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే పదే పదే సోదాలు జరుగుతున్నాయి.
సోదాల్లో భాగంగా ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, అనేకమంది నేతల వ్యక్తిగత ఆదాయ వివరాలు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు దగ్గర దొరికాయట. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ టార్గెట్ రీచయ్యేంతవరకు ఈడీ సోదాలు చేస్తునే ఉంటుందని అర్దమవుతోంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేషనల్ హెరాల్డ్ మీడియా ముసుగులోను దాని అనుబంధ సంస్ధల వ్యవహారాల్లో విచారణకు హాజరు కావాలని షబ్బీర్ ఆలీ, రేణుకాచౌదరి, గీతారెడ్డి లాంటి సీనియర్లకు నోటీసులిచ్చింది. విచారణ పేరుతో తమచుట్టూ ఈడీ ఎన్నిసార్లు తిప్పించుకున్నా అడిగేవారే లేరు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికే కారణమని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కష్టమట. దాంతో ఎలాగైనా గెలవాలన్న ప్లాన్ తోనే ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యిందనే ఆరోపణలు పెరిగిపోతోంది.
This post was last modified on September 24, 2022 10:27 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…