రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు. జోడు పదవుల్లో కంటిన్యు అవుదామని అనుకున్న అశోక్ కి నిరాస తప్పలేదు. వచ్చే నెల 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో అశోక్ పోటీ చేస్తున్నారు. అశోక్ తో పాటు శశిథరూర్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ఇంకా ఎంతమంది రంగంలోకి దిగుతారో తెలీదు.
ఈ విషయం ఇలాగుంటే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తో పాటు రాజస్ధాన్ సీఎంగా కూడా కంటిన్యు అవ్వాలని అశోక్ పట్టుదలగా ఉన్నారు. తనకు రెండు కాదు మూడు పదవులను నిర్వహించేంత సామర్ధ్యం ఉందని పదే పదే చెప్పారు. అశోక్ సమస్య ఏమిటంటే తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సుండటమే. సీఎంగా తప్పుకోవటానికి అశోక్ ఎంతమాత్రం ఇష్టపడటంలేదు. కారణం ఏమిటంటే తన బద్ధశత్రువు సచిన్ పైలెట్ ఎక్కడ సీఎం అవుతారో అనే ఆందోళన అశోక్ లో స్పష్టంగా కనబడుతోంది.
సచిన్ ను అడ్డుకోవటంలో భాగంగానే జోడు పదవుల నిర్వహణంటు పట్టుబడుతున్నారు. అయితే అశోక్ ఆలోచనలకు రాహుల్ పెద్ద షాకిచ్చారు. ఎట్టి పరిస్ధితుల్లోను జోడు పదవులు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నపుడు సీఎం పదవిని వదులుకోవాల్సిందేని చెప్పేశారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని అశోక్ తన వారసుడిగా అసెంబ్లీ స్పీకర్ జోషీని ప్రతిపాదించినట్లు సమాచారం.
అంటే సచిన్ ను సీఎం కానివ్వకుండా అడ్డుకోవటమే అశోక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. నిజానికి రాజస్ధాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం అవ్వాల్సింది సచినే. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ బలోపేతానికి ఎక్కువ కష్టపడింది సచిన్ మాత్రమే. అప్పట్లో కష్టమంతా సచిన్ ది అయితే సీఎం కుర్చీలో కూర్చున్నది మాత్రం అశోక్. పోనీ ఇప్పుడైనీ సచిన్ కు అవకాశం వస్తుందని అనుకుంటే ఇపుడు కూడా రాకుండా అశోక్ అడ్డుకుంటున్నారు. చివరకు రాజస్ధాన్ రాజకీయం ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on September 23, 2022 12:22 pm
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…