రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు. జోడు పదవుల్లో కంటిన్యు అవుదామని అనుకున్న అశోక్ కి నిరాస తప్పలేదు. వచ్చే నెల 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో అశోక్ పోటీ చేస్తున్నారు. అశోక్ తో పాటు శశిథరూర్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ఇంకా ఎంతమంది రంగంలోకి దిగుతారో తెలీదు.
ఈ విషయం ఇలాగుంటే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తో పాటు రాజస్ధాన్ సీఎంగా కూడా కంటిన్యు అవ్వాలని అశోక్ పట్టుదలగా ఉన్నారు. తనకు రెండు కాదు మూడు పదవులను నిర్వహించేంత సామర్ధ్యం ఉందని పదే పదే చెప్పారు. అశోక్ సమస్య ఏమిటంటే తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సుండటమే. సీఎంగా తప్పుకోవటానికి అశోక్ ఎంతమాత్రం ఇష్టపడటంలేదు. కారణం ఏమిటంటే తన బద్ధశత్రువు సచిన్ పైలెట్ ఎక్కడ సీఎం అవుతారో అనే ఆందోళన అశోక్ లో స్పష్టంగా కనబడుతోంది.
సచిన్ ను అడ్డుకోవటంలో భాగంగానే జోడు పదవుల నిర్వహణంటు పట్టుబడుతున్నారు. అయితే అశోక్ ఆలోచనలకు రాహుల్ పెద్ద షాకిచ్చారు. ఎట్టి పరిస్ధితుల్లోను జోడు పదవులు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నపుడు సీఎం పదవిని వదులుకోవాల్సిందేని చెప్పేశారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని అశోక్ తన వారసుడిగా అసెంబ్లీ స్పీకర్ జోషీని ప్రతిపాదించినట్లు సమాచారం.
అంటే సచిన్ ను సీఎం కానివ్వకుండా అడ్డుకోవటమే అశోక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. నిజానికి రాజస్ధాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం అవ్వాల్సింది సచినే. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ బలోపేతానికి ఎక్కువ కష్టపడింది సచిన్ మాత్రమే. అప్పట్లో కష్టమంతా సచిన్ ది అయితే సీఎం కుర్చీలో కూర్చున్నది మాత్రం అశోక్. పోనీ ఇప్పుడైనీ సచిన్ కు అవకాశం వస్తుందని అనుకుంటే ఇపుడు కూడా రాకుండా అశోక్ అడ్డుకుంటున్నారు. చివరకు రాజస్ధాన్ రాజకీయం ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…