Political News

జగన్ కు వేరే దారి లేదు

ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చిచెప్పింది. ఈ మద్యనే జరిగినా పార్టీ ప్లీనరీ సమావేశంలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నేతలు తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం చెల్లదని అప్పట్లోనే అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీల్లో అధ్యక్ష పదవిని ఎన్నిక ద్వారా మాత్రమే భర్తీ చేయాలి కానీ నామినేషన్ ద్వారా కాదు.

తన శాశ్వత అధ్యక్ష పదవి కమీషన్ నిబంధనల ప్రకారం చెల్లదని తెలిసినా అదే తీర్మానాన్ని చేయించుకున్నారు. దాంతో మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా వైసీపీకి కమీషన్ నోటీసులిచ్చింది. అయితే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. దాంతో వేరే దారిలేక జగన్ శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు ఫైనల్ ఉత్తర్వుల్లో కమీషన్ స్పష్టంగా చెప్పింది. ఈ ఉత్తర్వులను పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పంపింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నిక ద్వారా అయినా తీర్మానం ద్వారా అయినా జగన్ మాత్రమే అద్యక్షుడిగా ఉంటారని అందరికీ తెలుసు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం తీర్మానం ద్వారా అద్యక్షుడి నియామకం చెల్లదు. కచ్చితంగా రెండేళ్ళకో లేదా మూడేళ్ళకో కమీషన్ విధించిన కాలపరిమితి ప్రకారమే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సుంటుంది. కమీషన్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి.

పార్టీని రిజస్టర్ చేసేటపుడే, గుర్తింపు తెచ్చుకునేటప్పుడే కేంద్ర ఎన్నికల కమీషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సుంటుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు కమీషన్ భావిస్తే సదరు పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం కమీషన్ కు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే కమీషన్ ఉత్తర్వులకు స్పందించాలి. అంతర్గతంగా ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. జగన్ ఉన్నంతకాలం తానే అధ్యక్షుడిగా పార్టీ ఎన్నుకుంటే కమీషన్ కు ఎలాంటి అభ్యంతరాలుండవు. కాబట్టి మొండితనాన్ని పక్కనపెట్టేసి వెంటనే జరగాల్సింది చూస్తే మంచింది.

This post was last modified on September 22, 2022 11:26 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

10 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

53 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago