ఏపీ రాజకీయాల్లో తాజా వివాదంపై ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద భగ్గముంటున్న విషయం తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును మార్చేసి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. అసెంబ్లీ, శాసనమండలిలో అధికారపార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు మెజారిటి కారణంగా ఆమోదం కూడా పొందేశాయి. దాంతో యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు స్ధానంలో డాక్టర్ వైఎస్సార్ పేరొచ్చేసింది. జగన్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలోను బయటా టీడీపీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి.
సరే జగన్ తీసుకునే ప్రతీనిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతునే ఉంటాయి. ఏ ఒక్క నిర్ణయానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మద్దతివ్వలేదు. సరే ఏపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనుకుంటే ఇపుడు చెల్లెలు వైఎస్ షర్మిల కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటు నిలదీశారు. ఎన్టీయార్ పేరును తీసేయటం వల్ల దానికున్న పవిత్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం మారినపుడల్లా అప్పటికే ఉన్న పేర్లను తీసేసి కొత్తపేర్లు పెడుతుపోతే జనాల్లో అయమోయం వచ్చేస్తుందన్నారు. 1998 నుండి హెల్త్ యూనివర్సిటికి ఉన్న ఎన్టీయార్ పేరును తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం సరిగా వివరించలేకపోయిందని షర్మిలన్నారు. అంటే అసెంబ్లీలో జగన్ చెప్పిన కారణంతో షర్మిల ఏకీభవించటంలేదని అర్ధమవుతోంది.
నిజానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ తీసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల పార్టీకైనా ప్రభుత్వానికైనా వచ్చే లాభం ఏమీలేదు. పైగా పేరు తీసేయటం వల్ల ఎంతోకొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అధికారభాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. నిజానికి వీళ్ళిద్దరిదీ కమ్మ సామాజికవర్గమే అయినా జగన్ కు ఎంతో సన్నిహితులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళే జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాబట్టి అదునుచూసి షర్మిల కూడా జగన్ పై బండ వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 22, 2022 4:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…