Political News

టార్గెట్ 250 ఓట్లు

మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో కానీ తర్వాత పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కీలకమైన సమావేశం నిర్వహించారు. బట్టి చెప్పినదాని ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ కమిటి కచ్చితంగా 250 ఓట్లను తక్కువ కాకుండా పార్టీకి వేయించాలని టార్గెట్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 45 బూత్ కమిటీలున్నాయి.

అంటే బూత్ కమిటీల నుండే సుమారుగా 11500 ఓట్లు రావాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. 45 బూత్ కమిటీలను మూడు క్లాస్టర్ కమిటీలుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి బూత్ కమిటిలో సుమారు 20 మంది సభ్యులున్నారని వీరంతా తలా 15 ఓట్లు వేయించాలని బట్టి స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ ఒక సీనియర్ నేతను ఇన్చార్జిగా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బూత్ కమిటిలు, క్లాస్టర్ కమిటిలంతా సీనియర్ నేతతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలన్నారు.

భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు నిర్వహించటం కన్నా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయటంపైనే నేతలంతా దృష్టి పెట్టాలని బట్టి చెప్పారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ గెలుచుకోవటం చాలా అవసరమన్నారు. నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టు దృష్ట్యా ఉపఎన్నికలో గెలవటం పెద్ద కష్టం కూడా కాదన్నారు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఉపఎన్నిక గెలుపును చాలెంజిగా తీసుకుని పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.

మండలాల్లో పనిచేసే సీనియర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మంచి మెజారిటీ తీసుకొస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఖాయమని రేవంత్ ఇప్పటికే హామీ ఇచ్చున్నారు. అంటే పార్టీలోని సీనియర్లంతా ఉపఎన్నికలో గెలుపుకోసం ఎవరిస్ధాయిలో వాళ్ళు చిత్తశుద్దితో పనిచేయాలని గట్టిగానే అనుకున్నట్లు అనిపిస్తున్నది. అయితే ఇదంతా ఎన్నికలు పూర్తయ్యే దాకా ఉంటుందా అనేదే సందేహం. ఎక్కడో జరిగే చిన్న ఘటనను పట్టుకుని కూడా సీనియర్లు కుమ్ములాడేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. మరి ఉపఎన్నికలో ఏమవుతుందో చూడాలి.

This post was last modified on September 21, 2022 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

24 seconds ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

1 minute ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

16 minutes ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

1 hour ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

2 hours ago

ఎన్నిసార్లు చెప్పాలి.. సీనియ‌ర్ న‌టి అస‌హ‌నం

90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…

3 hours ago