ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం అసెం బ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ను తానుకానీ, పార్టీ నాయకులు కానీ.. ఎక్కడా .. ఎప్పుడూ.. కించపరచలేదన్నారు. ఆయనపట్ల తనకు ఎఫెక్షన్ ఉందని తెలిపారు. పాదయాత్ర సమయంలో కూడా.. ఎన్టీఆర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సమయంలో కొందరు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారన్నారు.
దీంతో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్టు చెప్పారు. అదేసమయంలో చంద్రబాబుపైనా.. జగన్ సటైర్లు వేశారు. ఎన్టీఆర్ను పూర్తిపేరుతో నందమూరి తారక రామారావుగారు అని పిలిస్తే.. చంద్రబాబుకు నచ్చదని.. జగన్ అన్నారు. చంద్రబాబు స్వయంగా నందమూరి తారకరామా రావు గారు అని పిలిస్తే.. పైన ఉన్న ఎన్టీఆర్ కు నచ్చదని వ్యాఖ్యానించారు. సినీరంగంలో ఆయనకు ఉన్న అభినివేశం.. దేశంలోనే ఎవరికీ లేదని జగన్ చెప్పారు.
ఏడు సంవత్సరాలు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే.. ఆయన మరిన్ని సంవత్సరాలు.. జీవించి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే.. ఆయన మరిన్ని సంవత్సరాలు.. ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు అంతేకాదు. చంద్రబాబు అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కూడా కాదని జగన్ ఎద్దేవా చేశారు.
కేంద్రంలో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు .. తన పార్టీ నేతలకు పదవులు ఇప్పించుకున్నారని.. చెప్పారు. అదేసమయంలో తనకు అండగా ఉన్న కొందరు వ్యక్తులకు అవార్డులు కూడా ఇప్పించుకున్నారని.. జగన్ అన్నారు. అయితే.. తనకు పిల్లనిచ్చిన మామకు మాత్రం భారతరత్న అవార్డును ఇప్పించుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
“ఎన్టీఆర్ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు. ఎన్టీఆర్పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం. నేను ఎప్పుడూ ఎన్టీఆర్ను ఒక్కమాట కూడా అనలేదు. ఎన్టీఆర్ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదు. చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్కు నచ్చదు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదు” అని జగన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on September 21, 2022 2:29 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…