తానేం చేస్తున్నాడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కైనా అర్ధమవుతోందా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పీసీసీ ఆఫీసు బేరర్ల సంఖ్యను పెంచటంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటిల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగా పనిచేయని డీసీసీ అద్యక్షులను మార్చేసి కొత్తవారిని నియమించాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకనే కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి గ్నీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రేవంత్ నిర్ణయం తీసుకున్న సమయమే చాలా తప్పుగా ఉంది. మునుగోడు ఉపఎన్నిక ముందు అవసరమా ఇపుడు ? అనే చర్చ కూడా మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో గెలవాలని ఒకవైపు చెబుతునే మరోవైపు డీసీసీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించుకోవటం తెలివైన పనికాదు. ఎందుకంటే తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకన్న విషయాన్ని రేవంత్ మధ్యమధ్యలో మరచిపోతున్నట్లున్నారు.
రేవంత్ కాదన్న వాళ్ళు నేరుగా ఢిల్లీకి వెళ్ళి తాము అనుకున్నది సాధించుకొస్తారు. ఈ విషయం ఇప్పటికే రేవంత్ కు చాలాసార్లు అనుభవమైంది. అయినా డీసీసీ అధ్యక్షులుగా తన మద్దతుదారులను నియమించుకోవాలనే ఆలోచన రేవంత్ లో పోలేదు. రేవంత్ మార్చినా వెంటనే సదరు నేతలు ఢిల్లీకి వెళ్ళి వెంటనే రేవంత్ నియమాకాలను రద్దు చేయించుకొస్తారు. ఎందుకంటే అధిష్టానం దగ్గర తనకెంత పలుకుబడుందని రేవంత్ అనుకుంటున్నారో అంతే పలుకుబడి మిగిలిన నేతలకు కూడా ఉందన్నది వాస్తవం.
సరిగ్గా ఉపఎన్నిక ముందు రాష్ట్ర కమిటీని విస్తరించటం, డీసీసీ అద్యక్షులను మార్చాలని అనుకోవటం రేవంత్ కు మంచిది కాదు. అదేదో ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా అర్ధముంది. లేకపోతే ఈ పరిణామాలు రేపటి ఉపఎన్నిక మీద కచ్చితంగా పడుతుంది. ఉపఎన్నికలో తేడా వస్తే అందరూ కలిసి రేవంత్ నే బాధ్యుడిని చేయటం ఖాయం. తమకెంతో పలుకుబడి ఉందని అనుకున్న నేతలను కూడా అధిష్టానం ఒక్కరోజులో తీసి పక్కన పెడేసిన సందర్భాలు కాంగ్రెస్ లో చాలా వున్నాయని రేవంత్ మరచిపోకూడదు.
This post was last modified on September 21, 2022 12:50 pm
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…