Political News

రేవంత్ రాంగ్ టైమింగ్

తానేం చేస్తున్నాడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కైనా అర్ధమవుతోందా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పీసీసీ ఆఫీసు బేరర్ల సంఖ్యను పెంచటంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటిల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగా పనిచేయని డీసీసీ అద్యక్షులను మార్చేసి కొత్తవారిని నియమించాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకనే కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి గ్నీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రేవంత్ నిర్ణయం తీసుకున్న సమయమే చాలా తప్పుగా ఉంది. మునుగోడు ఉపఎన్నిక ముందు అవసరమా ఇపుడు ? అనే చర్చ కూడా మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో గెలవాలని ఒకవైపు చెబుతునే మరోవైపు డీసీసీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించుకోవటం తెలివైన పనికాదు. ఎందుకంటే తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకన్న విషయాన్ని రేవంత్ మధ్యమధ్యలో మరచిపోతున్నట్లున్నారు.

రేవంత్ కాదన్న వాళ్ళు నేరుగా ఢిల్లీకి వెళ్ళి తాము అనుకున్నది సాధించుకొస్తారు. ఈ విషయం ఇప్పటికే రేవంత్ కు చాలాసార్లు అనుభవమైంది. అయినా డీసీసీ అధ్యక్షులుగా తన మద్దతుదారులను నియమించుకోవాలనే ఆలోచన రేవంత్ లో పోలేదు. రేవంత్ మార్చినా వెంటనే సదరు నేతలు ఢిల్లీకి వెళ్ళి వెంటనే రేవంత్ నియమాకాలను రద్దు చేయించుకొస్తారు. ఎందుకంటే అధిష్టానం దగ్గర తనకెంత పలుకుబడుందని రేవంత్ అనుకుంటున్నారో అంతే పలుకుబడి మిగిలిన నేతలకు కూడా ఉందన్నది వాస్తవం.

సరిగ్గా ఉపఎన్నిక ముందు రాష్ట్ర కమిటీని విస్తరించటం, డీసీసీ అద్యక్షులను మార్చాలని అనుకోవటం రేవంత్ కు మంచిది కాదు. అదేదో ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా అర్ధముంది. లేకపోతే ఈ పరిణామాలు రేపటి ఉపఎన్నిక మీద కచ్చితంగా పడుతుంది. ఉపఎన్నికలో తేడా వస్తే అందరూ కలిసి రేవంత్ నే బాధ్యుడిని చేయటం ఖాయం. తమకెంతో పలుకుబడి ఉందని అనుకున్న నేతలను కూడా అధిష్టానం ఒక్కరోజులో తీసి పక్కన పెడేసిన సందర్భాలు కాంగ్రెస్ లో చాలా వున్నాయని రేవంత్ మరచిపోకూడదు.

This post was last modified on September 21, 2022 12:50 pm

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

25 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

1 hour ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

2 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago