Political News

మూడేళ్ల‌లో జ‌గ‌న్ దోపిడీ 2 ల‌క్ష‌ల కోట్లు: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డా రు. గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాధ‌నాన్ని దోచేశార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో స‌హ‌జ వ‌నరులైన‌.. భూమిని, ఇసుక‌ను.. వైసీపీ నాయ‌కులు దోచేస్తున్నారంటూ.. నేత‌లు నిర‌స‌న‌కు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘అవినీతిలో ఏ-1 జగన్ రెడ్డి ‘ అని నాయ‌కులు నినాదాలతో హోరెత్తించారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. “జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు” అని నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ‘జే బ్రాండ్స్’తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు.

‘జగన్ వాకిట్లో గంజాయి చెట్లు’, ‘సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ’ అనే ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నారా లోకేష్ స‌హా ఇత‌ర‌ నేతల మండిప‌డ్డారు. ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగ‌ణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక ద‌శ‌లో నేత‌లు.. అసెంబ్లీని ముట్ట‌డిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

This post was last modified on September 21, 2022 12:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

37 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago