Political News

మూడేళ్ల‌లో జ‌గ‌న్ దోపిడీ 2 ల‌క్ష‌ల కోట్లు: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డా రు. గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాధ‌నాన్ని దోచేశార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో స‌హ‌జ వ‌నరులైన‌.. భూమిని, ఇసుక‌ను.. వైసీపీ నాయ‌కులు దోచేస్తున్నారంటూ.. నేత‌లు నిర‌స‌న‌కు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘అవినీతిలో ఏ-1 జగన్ రెడ్డి ‘ అని నాయ‌కులు నినాదాలతో హోరెత్తించారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. “జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు” అని నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ‘జే బ్రాండ్స్’తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు.

‘జగన్ వాకిట్లో గంజాయి చెట్లు’, ‘సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ’ అనే ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నారా లోకేష్ స‌హా ఇత‌ర‌ నేతల మండిప‌డ్డారు. ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగ‌ణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక ద‌శ‌లో నేత‌లు.. అసెంబ్లీని ముట్ట‌డిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

This post was last modified on September 21, 2022 12:46 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

18 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

21 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

1 hour ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

2 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

3 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

3 hours ago