Political News

మూడేళ్ల‌లో జ‌గ‌న్ దోపిడీ 2 ల‌క్ష‌ల కోట్లు: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డా రు. గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాధ‌నాన్ని దోచేశార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో స‌హ‌జ వ‌నరులైన‌.. భూమిని, ఇసుక‌ను.. వైసీపీ నాయ‌కులు దోచేస్తున్నారంటూ.. నేత‌లు నిర‌స‌న‌కు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘అవినీతిలో ఏ-1 జగన్ రెడ్డి ‘ అని నాయ‌కులు నినాదాలతో హోరెత్తించారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. “జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు” అని నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ‘జే బ్రాండ్స్’తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు.

‘జగన్ వాకిట్లో గంజాయి చెట్లు’, ‘సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ’ అనే ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నారా లోకేష్ స‌హా ఇత‌ర‌ నేతల మండిప‌డ్డారు. ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగ‌ణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక ద‌శ‌లో నేత‌లు.. అసెంబ్లీని ముట్ట‌డిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

This post was last modified on September 21, 2022 12:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

1 hour ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago