ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. గడిచిన మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ ప్రజాధనాన్ని దోచేశారని ఆయన విమర్శలు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తాజాగా బుధవారం ఉదయం.. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో సహజ వనరులైన.. భూమిని, ఇసుకను.. వైసీపీ నాయకులు దోచేస్తున్నారంటూ.. నేతలు నిరసనకు దిగారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘అవినీతిలో ఏ-1 జగన్ రెడ్డి ‘ అని నాయకులు నినాదాలతో హోరెత్తించారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. “జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు” అని నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ‘జే బ్రాండ్స్’తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు.
‘జగన్ వాకిట్లో గంజాయి చెట్లు’, ‘సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ’ అనే ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నారా లోకేష్ సహా ఇతర నేతల మండిపడ్డారు. ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక దశలో నేతలు.. అసెంబ్లీని ముట్టడిస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
This post was last modified on September 21, 2022 12:46 pm
కోర్ట్.. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా. ఇందులో చెప్పుకోదగ్గ స్టార్ లేడు. కమెడియన్…
కమ్యూనిస్టులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు టీడీపీతో జట్టుకట్టిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. తర్వాత కొన్ని…
అమెరికా ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని…
కేవలం 12 రోజుల గ్యాప్ తో ఇద్దరు సౌత్ దర్శకుల బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మొదటిది సికందర్.…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆవేశాలు.. ఆగ్రహాలు కామన్గా మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి., ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులకు…
2023లో సంచలనం సృష్టించిన సరూర్నగర్ అప్సర హత్యకేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం జీవిత ఖైదు…