ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనమైన మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా దీనిని పర్యవేక్షిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత పేర్కొన్నారు.
కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డాక్టర్ సునీత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసి.. తదుపరి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్ వేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టింది.
సునీత లేవనెత్తిన అంశాలపై… సమాధానం చెప్పాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 14న చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా వాదనలు వినిపించారు. విచారణ సాగకుండా… దర్యాప్తు సంస్థ అధికారులు, సాక్షులను బెదిరిస్తున్నారని ధర్మాసనానికి సిద్దార్థ వెల్లడించారు. విచారణను తెలంగాణ హైకోర్టు పరిధిలోని ట్రయల్ కోర్టుకు మార్చాలని సునీతా రెడ్డి తరపున ఆయన సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…