వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం లో దగ్గుబాటి చెంచురామ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెంచురామ్ ఎవరంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు. చెంచురామ్ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్లు జిల్లా పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. మొదటి సొంత నియోజకవర్గమైన పర్చూరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబానాయుడు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడింది.
పర్చూరు నుండి ప్రస్తుతం ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఏలూరికే టికెట్ కన్ఫర్మ్ అయినట్లు లెక్క. దాంతో వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీ దృష్టి చీరాల మీదకు మళ్ళిందట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ప్రస్తుతం వైసీపీకి దగ్గరైపోయారు. ఈయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీలో చేరి చాలా యాక్టివ్ గా ఉన్నారు.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటేషే పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా చీరాలలో పోటీచేయబోయేది తానే అని వెంకటేష్ కూడా ప్రకటించారు. కాబట్టి టీడీపీ తరపున ఇక్కడ అవకాశముంది కాబట్టి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిందట. నిజానికి దగ్గుబాటి ఫ్యామిలి ప్రస్తుతం టీడీపీతో అంటీ ముట్టనట్లగానే ఉంది. వైసీపీ నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుండి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇదే సమయంలో ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇపుడు ఆమెకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిపోతోంది.
తొందరలోనే ఆమె పార్టీలో నుండి బయటకు వచ్చేసే అవకాశం ఉందనే ప్రచారం తెలిసిందే. ఒకవేళ ఆమెగనుక బీజేపీలో నుండి వచ్చేస్తే బహుశా కుటుంబం అంతా టీడీపీలో చేరే అవకాశముంది. అప్పుడు దగ్గుబాటి చెంచురామ్ కు చీరాల టికెట్ ను ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే చెంచురామ్ ఇటు చంద్రబాబు, అటు లోకేష్ తో టచ్ లోనే ఉన్నారట.
This post was last modified on September 22, 2022 9:42 pm
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…