వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం లో దగ్గుబాటి చెంచురామ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెంచురామ్ ఎవరంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు. చెంచురామ్ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్లు జిల్లా పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. మొదటి సొంత నియోజకవర్గమైన పర్చూరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబానాయుడు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడింది.
పర్చూరు నుండి ప్రస్తుతం ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఏలూరికే టికెట్ కన్ఫర్మ్ అయినట్లు లెక్క. దాంతో వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీ దృష్టి చీరాల మీదకు మళ్ళిందట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ప్రస్తుతం వైసీపీకి దగ్గరైపోయారు. ఈయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీలో చేరి చాలా యాక్టివ్ గా ఉన్నారు.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటేషే పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా చీరాలలో పోటీచేయబోయేది తానే అని వెంకటేష్ కూడా ప్రకటించారు. కాబట్టి టీడీపీ తరపున ఇక్కడ అవకాశముంది కాబట్టి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిందట. నిజానికి దగ్గుబాటి ఫ్యామిలి ప్రస్తుతం టీడీపీతో అంటీ ముట్టనట్లగానే ఉంది. వైసీపీ నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుండి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇదే సమయంలో ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇపుడు ఆమెకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిపోతోంది.
తొందరలోనే ఆమె పార్టీలో నుండి బయటకు వచ్చేసే అవకాశం ఉందనే ప్రచారం తెలిసిందే. ఒకవేళ ఆమెగనుక బీజేపీలో నుండి వచ్చేస్తే బహుశా కుటుంబం అంతా టీడీపీలో చేరే అవకాశముంది. అప్పుడు దగ్గుబాటి చెంచురామ్ కు చీరాల టికెట్ ను ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే చెంచురామ్ ఇటు చంద్రబాబు, అటు లోకేష్ తో టచ్ లోనే ఉన్నారట.
This post was last modified on September 22, 2022 9:42 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…