Political News

అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ..

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల రాళ్లు రువ్వారు. ఇదే నిజం అనుకుందాం. కానీ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్‌ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల రేటింగును ప్రతికూలంగా పేర్కొంది.

రిజర్వుబ్యాంకు కల్పించిన ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వెసులుబాటుతోనే రాష్ట్రం నడుస్తోందని.. క్రిసిల్‌ స్పష్టంగా పేర్కొంది. మ‌రి రాష్ట్ర ఆర్థికం అంత చక్కగా ఉంటే వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగులో ఉన్నట్లు? ఈ బిల్లుల కోసం గుత్తేదారులు, సరఫరాదారు లు న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు? పింఛనర్లకు ఎప్పుడో ఇవ్వాల్సిన కరవు భత్యం బకాయిలు ఎందుకు సకాలంలో ఇవ్వట్లేదు?

ఆర్థికవ్యవస్థ బాగుండి, బిల్లులు సరిగానే చెల్లిస్తే.. గుత్తేదారులు టెండర్లంటేనే ఎందుకు భయపడుతున్నా రు? శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం కోటి బిల్లు ఇంతవరకు ఎందుకు చెల్లించలేదు? ఉద్యోగులు దాచుకున్న సొమ్ముల నుంచి రుణాలు తీసుకోవడానికి దరఖాస్తు చేస్తే నెలల తరబడి ఎందుకు పెండింగులో ఉంచు తున్నారు? ఆర్థిక పరిస్థితి అంత బాగుంటే ప్రతినెలా 8 వేల కోట్లు, 9 వేల కోట్లు బహిరంగ మార్కెట్‌ రుణాలు ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు లక్షా 20 వేల 556 కోట్ల రూపాయలని.. 2019 మే నెల నాటికి ఉన్న అప్పు 2 లక్షల 69 వేల 462 కోట్లు అని సీఎం జగన్‌ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రుణం 3 లక్షల 82వేల 165 కోట్లు అని ఇవన్నీ కాగ్‌ నివేదికలోనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని 29 కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు లక్షా 15 వేల 403.58 కోట్లు. ఇవికాక ఏపీఎస్‌డీసీ ద్వారా తీసుకున్న రుణం 23 వేల 200 కోట్ల రూపాయలు. ఇవి కలిస్తే లక్షా 38 వేల 603 కోట్లు. నాన్‌ గ్యారంటీ రుణాలు 87 వేల 233 కోట్లు. అవి కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా 8 వేల 300 కోట్లు రుణం తీసుకున్నారు. ఏపీఎస్‌డీసీ రుణం, బెవరేజస్‌ కార్పొరేషన్‌ రుణం కూడా ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే బహిరంగ మార్కెట్‌ ద్వారా సుమారు 40వేల కోట్లు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి ద్రవ్యలోటు, జీడీపీలో రుణాల రేటు, అప్పులు మొత్తం పెరిగిన శాతాన్ని కూడా గతంతో, ఇతర రాష్ట్రాలతో పోల్చి చెప్పారు. అసలు అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ఇక వాటి ఆధారంగా చేసే విశ్లేషణలు ఎలా సరైనవవుతాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల అప్పులు ఏవీ మొత్తం అప్పుల్లో కలపలేదు. ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చితే అందులోని వాస్తవాలు ఎలా తేలుతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

9 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago