అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై.. రెండు రోజులు గడిచిపోయాయి. అధికార పార్టీ తరఫున బలంగా మాట్లాడే వారి కోసం..అధినేత జగన్ ఎదురు చూస్తున్నారు. వెతికి మరీ తెచ్చుకుని.. సభలోమైకు ఇస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. నెల్లూరు కు చెందిన ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. నిజానికి ఆయన మంత్రిగా ఉన్నా.. అంతకు ముందు అయినా.. టీడీపీపై తీవ్రస్థాయిలోవిమర్శలు చేసేవారు.
ముఖ్యంగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్లపై విరుచుకుపడేవారు. అయితే.. ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత.. అనూహ్యంగా లోకల్గా ఉన్న సొంత పార్టీనాయకులతోనే సై అంటే.. సై అన్నట్టుగా వ్యవహరించారు. తర్వాత.. ఎందుకో.. ఒక్కసారిగా సైలెంట్క్ష అయిపోయారు. ఇక, ఇప్పుడు అసెంబ్లీలోనూ ఆయన వాయిస్ వినిపించడం లేదు. ఇప్పుడు ఈ విషయమే..చర్చకు వస్తోంది. మంత్రి పదవి లేదనే బెంగ పట్టుకుందని.. కొందరు గుసగుసలాడుతున్నారు.
మరికొందరు.. సొంత పార్టీ నేతలే తనను పక్కన పెడుతున్నారనే ఆవేదనలో ఉన్నారనిచెబుతున్నారు. అదేసమయంలో అధినేత జగన్ను ఆయన ఎంతో అభిమానించారని.. కానీ, జగనే ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం లేదని అందుకే మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఏదేమైనా.. అనిల్ వాయిస్ ఎక్కడా వినిపించకపోవడంతో వైసీపీలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నవారు మాత్రం పెరుగుతున్నారు.
రాజకీయాల్లో వివాదాలు.. విభేదాలు.. అసంతృప్తులు కామనే అయినా.. మంత్రి పదవి దక్కని వారు మాత్రం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావడం గమనార్హం. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఉదయ భాను, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటివారు.. ఫైర్ అయ్యేవారు.కానీ, ఇప్పుడు వారంతా కూడా మౌనంగా ఉంటున్నారు. దీనిని బట్టి.. వైసీపీలో ఇంకా అసంతృప్తి చల్లారలేదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 17, 2022 10:51 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…