Political News

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో శృతి మించిన కరోనా

టెస్టులు చేస్తున్న రాష్ట్రంలోను కేసులు కంట్రోల్ కావడం లేదు. టెస్టులు చేయని రాష్ట్రంలోను కరోనా కంట్రోల్ కావడం లేదు. టెస్టులతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు సమాంతరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. టెస్టింగ్ ట్రేసింగ్ చేసినా ఏపీలో ఎందుకు అంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు నుంచి అప్రమత్తంగా ఉందన్న తెలంగాణ రాజధాని హైదరాబాదును సగం మంది ఖాళీ చేసినా ఎందుకు విజృంభిస్తుందో తెలియడం లేదు. మొత్తానికి తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా గుప్పిట్లో విలవిల్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1322 కేసులు వెలుగు చూశాయి. వీటితో ఏపీ 20 వేల మార్కు దాటింది. తాజాగా డిశ్చార్జి అయిన కేసులు 424 గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8290 గా ఉంది. విచారకరం ఏమిటంటే రాష్ట్రంలో యాక్టివ్ కేసులు (10860) ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరణించిన ఏడుగురితో కలిపి ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 239కి చేరింది. ఇక మొత్తం ఏపీలో ఇప్పటివరకు 1033852 కోవిడ్ 19 టెస్టులు చేయగా, 16712 కరోనా పరీక్షలతో గత 24 గంటల్లో చేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1831 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాదు నగరంలోనే 1419 కేసులు నమోదయ్యాయి. వీటితో తెలంగాణ కేసులు 25 వేల మార్కును దాటాయి. మొత్తం మరణాలు 306. ఇక పరీక్షల విషయానికొస్తే తెలంగాణ ఈరోజు చేసిన 6383 టెస్టులతో కలిపి మొత్తం 1,22,218 టెస్టులు ఇప్పటివరకు చేసింది. ఈ ఒక్క రోజే 19 మంది మరణించడం తెలంగాణలో పెరుగుతున్న మరణాలకు సూచిక. ఏపీతో పోలిస్తే తెలంగాణ యాక్టివ్ కేసులు తక్కువ. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 14781 కాగా, యాక్టివ్ కేసులు 10446గా ఉన్నాయి.

This post was last modified on July 7, 2020 12:00 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

3 minutes ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

2 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

2 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

3 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

5 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

6 hours ago