Political News

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో శృతి మించిన కరోనా

టెస్టులు చేస్తున్న రాష్ట్రంలోను కేసులు కంట్రోల్ కావడం లేదు. టెస్టులు చేయని రాష్ట్రంలోను కరోనా కంట్రోల్ కావడం లేదు. టెస్టులతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు సమాంతరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. టెస్టింగ్ ట్రేసింగ్ చేసినా ఏపీలో ఎందుకు అంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు నుంచి అప్రమత్తంగా ఉందన్న తెలంగాణ రాజధాని హైదరాబాదును సగం మంది ఖాళీ చేసినా ఎందుకు విజృంభిస్తుందో తెలియడం లేదు. మొత్తానికి తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా గుప్పిట్లో విలవిల్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1322 కేసులు వెలుగు చూశాయి. వీటితో ఏపీ 20 వేల మార్కు దాటింది. తాజాగా డిశ్చార్జి అయిన కేసులు 424 గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8290 గా ఉంది. విచారకరం ఏమిటంటే రాష్ట్రంలో యాక్టివ్ కేసులు (10860) ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరణించిన ఏడుగురితో కలిపి ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 239కి చేరింది. ఇక మొత్తం ఏపీలో ఇప్పటివరకు 1033852 కోవిడ్ 19 టెస్టులు చేయగా, 16712 కరోనా పరీక్షలతో గత 24 గంటల్లో చేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1831 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాదు నగరంలోనే 1419 కేసులు నమోదయ్యాయి. వీటితో తెలంగాణ కేసులు 25 వేల మార్కును దాటాయి. మొత్తం మరణాలు 306. ఇక పరీక్షల విషయానికొస్తే తెలంగాణ ఈరోజు చేసిన 6383 టెస్టులతో కలిపి మొత్తం 1,22,218 టెస్టులు ఇప్పటివరకు చేసింది. ఈ ఒక్క రోజే 19 మంది మరణించడం తెలంగాణలో పెరుగుతున్న మరణాలకు సూచిక. ఏపీతో పోలిస్తే తెలంగాణ యాక్టివ్ కేసులు తక్కువ. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 14781 కాగా, యాక్టివ్ కేసులు 10446గా ఉన్నాయి.

This post was last modified on July 7, 2020 12:00 am

Share
Show comments
Published by
suman

Recent Posts

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

1 hour ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

7 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

7 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

7 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

9 hours ago

‘చెడు’ చూపించకుంటే ‘మంచి’ బయోపిక్ ఎలా?

70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…

9 hours ago