Political News

గోవధ నిషేధంపై తొలిబిల్లు కృష్ణంరాజు పెట్టారట

దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

కృష్ణంరాజు మృతిపట్ల రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, అందించిన చికిత్సల గురించి రాజ్ నాథ్ కు కిషన్ రెడ్డి తదితరులు వివరించారు. ప్రభాస్ కూడా రాజ్ నాథ్ తో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమానికి కూడా రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు.

కృష్ణంరాజు మంచి వ్యక్తి అని ఆయన తనుకు మంచి స్నేహితుడు అని రాజ్ నాథ్ ప్రశంసించారు. గోవధ నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణంరాజు అని రాజ్ నాథ్ తెలిపారు. తెలుగు ప్రజలకు రెబల్ స్టార్ అయిన కృష్ణంరాజు, స్వగ్రామంలో అందరికీ సొంతమనిషి అని
తెలిపారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఈ సంస్మరణ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎవరికి కష్టం వచ్చినా కృష్ణంరాజు ఆదుకునేవారని, కేంద్రమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని రఘురామ అన్నారు.

This post was last modified on September 16, 2022 8:04 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

7 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago