దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్ ను రాజ్ నాథ్ పరామర్శించారు.
కృష్ణంరాజు మృతిపట్ల రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, అందించిన చికిత్సల గురించి రాజ్ నాథ్ కు కిషన్ రెడ్డి తదితరులు వివరించారు. ప్రభాస్ కూడా రాజ్ నాథ్ తో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమానికి కూడా రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు మంచి వ్యక్తి అని ఆయన తనుకు మంచి స్నేహితుడు అని రాజ్ నాథ్ ప్రశంసించారు. గోవధ నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణంరాజు అని రాజ్ నాథ్ తెలిపారు. తెలుగు ప్రజలకు రెబల్ స్టార్ అయిన కృష్ణంరాజు, స్వగ్రామంలో అందరికీ సొంతమనిషి అని
తెలిపారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ఈ సంస్మరణ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎవరికి కష్టం వచ్చినా కృష్ణంరాజు ఆదుకునేవారని, కేంద్రమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని రఘురామ అన్నారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…