Political News

గోవధ నిషేధంపై తొలిబిల్లు కృష్ణంరాజు పెట్టారట

దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

కృష్ణంరాజు మృతిపట్ల రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, అందించిన చికిత్సల గురించి రాజ్ నాథ్ కు కిషన్ రెడ్డి తదితరులు వివరించారు. ప్రభాస్ కూడా రాజ్ నాథ్ తో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమానికి కూడా రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు.

కృష్ణంరాజు మంచి వ్యక్తి అని ఆయన తనుకు మంచి స్నేహితుడు అని రాజ్ నాథ్ ప్రశంసించారు. గోవధ నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణంరాజు అని రాజ్ నాథ్ తెలిపారు. తెలుగు ప్రజలకు రెబల్ స్టార్ అయిన కృష్ణంరాజు, స్వగ్రామంలో అందరికీ సొంతమనిషి అని
తెలిపారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఈ సంస్మరణ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎవరికి కష్టం వచ్చినా కృష్ణంరాజు ఆదుకునేవారని, కేంద్రమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని రఘురామ అన్నారు.

This post was last modified on September 16, 2022 8:04 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

37 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

1 hour ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

3 hours ago