ఏపీ మంత్రి వర్గాన్ని త్వరలోనే.. విస్తరించనున్నారా.. మంత్రులు ఈ విషయంలో గుంభనంగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో లాబీల్లో కొందరు నాయకులు.. ముచ్చట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాజాగా మరో సంచలన విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
త్వరలోనే.. మంత్రి వర్గాన్ని విస్తరించే ప్రణాళికలు చేస్తున్నారనేది.. వైసీపీ ఎమ్మెల్యేల ముచ్చట్ల మధ్య తెలిసిన విషయం. అయితే.. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు.. ఎందుకు మారుస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. 2019లో వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత.. తొలిసారి మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వీరిని ఇటీవల మార్చి ఏప్రిల్11న మరోసారి.. తన టీంను ఏర్పాటు చేసుకున్నారు జగన్.
నిజానికి.. ఈ రెండు కూడా జగన్ ఇప్పటి వరకు చెప్పినవే. అయితే.. ఇప్పుడు ప్రస్తుత మంత్రి వర్గంపై జగన్ అసంతృప్తితో ఉన్నారనేది.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. కేవలం మంత్రుల వ్యవహారశైలిపైనే.. ఆయన ఇటీవల.. పీకే టీంతో సర్వేలు చేయించారని.. ఈ సర్వేల్లో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయని అంటున్నారు. కొందరు మంత్రులు.. అంటే.. ఐదారుగురు మాత్రమే పనులు చేస్తున్నారని.. గటట్టి వాయిస్ వినిపిస్తున్నారని.. మిగిలిన వారు.. యథాలాపంగా.. నామ్ కే వాస్తే.. అన్నట్టుగా ఉన్నారని.. స్పష్టమైందట.
ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందట.. జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ.. జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు బయటకు రావడం లేదని.. కనీసం మాట్లాడడం లేదని.. ఆయన వాపోయారు. ఈ క్రమంలో ‘మార్చేస్తా’ అని కూడా ఆయన హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడు.. ఇదే విషయం పై ఎమ్మెల్యేలు.. లాబీల్లో మాట్లాడుకోవడం.. గమనార్హం. మంత్రి వర్గాన్ని మార్చేయడం ఖాయమని అంటున్నారు. తాజా మంత్రివర్గం మార్పు జరిగితే.. మళ్లీ కొడాలి నాని, పేర్నినాని.. వంటివారికి ప్రాధాన్యం దక్కుతుందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. మార్పు జరిగితే కనుక.. దసరా ముందే జరుగుతుందని గుసగుసలాడడం గమనార్హం.
This post was last modified on September 15, 2022 9:51 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…