Political News

త్వ‌ర‌లోనే ఏపీ మంత్రి వ‌ర్గ మార్పు.. లాబీల్లో ఇదే ముచ్చ‌ట‌!

ఏపీ మంత్రి వ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే.. విస్త‌రించ‌నున్నారా.. మంత్రులు ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో లాబీల్లో కొంద‌రు నాయ‌కులు.. ముచ్చ‌ట్లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా వ్యూహంతో జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకున్నారు.

త్వ‌ర‌లోనే.. మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే ప్ర‌ణాళిక‌లు చేస్తున్నార‌నేది.. వైసీపీ ఎమ్మెల్యేల ముచ్చ‌ట్ల మ‌ధ్య తెలిసిన విష‌యం. అయితే.. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్ప‌టికిప్పుడు.. ఎందుకు మారుస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019లో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తొలిసారి మంత్రి వ‌ర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వీరిని ఇటీవ‌ల మార్చి ఏప్రిల్‌11న మ‌రోసారి.. త‌న టీంను ఏర్పాటు చేసుకున్నారు జ‌గ‌న్‌.

నిజానికి.. ఈ రెండు కూడా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన‌వే. అయితే.. ఇప్పుడు ప్ర‌స్తుత మంత్రి వ‌ర్గంపై జ‌గ‌న్ అసంతృప్తితో ఉన్నార‌నేది.. వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. అంతేకాదు.. కేవ‌లం మంత్రుల వ్య‌వ‌హార‌శైలిపైనే.. ఆయ‌న ఇటీవ‌ల‌.. పీకే టీంతో స‌ర్వేలు చేయించార‌ని.. ఈ స‌ర్వేల్లో సంచ‌ల‌న వాస్త‌వాలు వెలుగు చూశాయ‌ని అంటున్నారు. కొంద‌రు మంత్రులు.. అంటే.. ఐదారుగురు మాత్ర‌మే ప‌నులు చేస్తున్నార‌ని.. గ‌ట‌ట్టి వాయిస్ వినిపిస్తున్నార‌ని.. మిగిలిన వారు.. య‌థాలాపంగా.. నామ్ కే వాస్తే.. అన్న‌ట్టుగా ఉన్నార‌ని.. స్ప‌ష్ట‌మైంద‌ట‌.

ఇదిలావుంటే.. కొన్నాళ్ల కింద‌ట‌.. జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలోనూ.. జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మంత్రులు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని.. క‌నీసం మాట్లాడ‌డం లేద‌ని.. ఆయ‌న వాపోయారు. ఈ క్ర‌మంలో ‘మార్చేస్తా’ అని కూడా ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. ఇదే విష‌యం పై ఎమ్మెల్యేలు.. లాబీల్లో మాట్లాడుకోవ‌డం.. గ‌మ‌నార్హం. మంత్రి వ‌ర్గాన్ని మార్చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తాజా మంత్రివ‌ర్గం మార్పు జ‌రిగితే.. మ‌ళ్లీ కొడాలి నాని, పేర్నినాని.. వంటివారికి ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజం అవుతుందో చూడాలి. మార్పు జ‌రిగితే క‌నుక‌.. ద‌స‌రా ముందే జ‌రుగుతుంద‌ని గుస‌గుస‌లాడ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

1 hour ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

1 hour ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

3 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

3 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago