Political News

బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందా ?

రాజధాని అంశంలో ఏమి మాట్లాడాలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో బీజేపీకి అర్థం కాక బుర్ర తిరిగిపోతున్నట్లుంది. ఒకసారేమో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోసారేమో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటారు. ఈ మధ్యేమో అమరావతి డిమాండుకే కమలనాథులు జై కొడుతున్నారు. న్యాయస్థానం టు దేవస్ధానం యాత్ర సందర్భంగా అమరావతికే బీజేపీకి జై కొట్టింది. తాజాగా అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్రకు కూడా బీజేపీ జై కొట్టింది.

అయితే తాజాగా ప్రొద్దుటూరులో రాయలసీమ జోనల్ స్ధాయి బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని డిమాండ్ చేశారు. డిమాండుతో సరిపెట్టుకోకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతు విశాఖను ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అంటే బీజేపీ నేతల తీరు ఎలాగుందంటే ఏ రోటికాడ ఆ పాట పాడాలన్నట్లుగా ఉంది. అమరావతి ప్రాంతంలో మాట్లాడినపుడు అమరావతి మాత్రమే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తారు. మొత్తానికి వీర్రాజు తాజా మాటలు విన్నతర్వాత రాజధానిపై బీజేపీలో ఎంతటి అయోమయం ఉందో అర్ధమైపోతోంది. అసలు రాజధానుల ఏర్పాటు తమ పరిధిలో లేదని కేంద్రం రెండుసార్లు హైకోర్టుకిచ్చిన అఫిడవిట్లలోనే స్పష్టం చేసింది.

రాజధాని ఏర్పాటు అన్నది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమే అని చెప్పిన విషయాన్ని బీజేపీ నేతలు మరచిపోయినట్లున్నారు. జనాల ఆకాంక్షల ప్రకారం అమారవతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అంటే అదీలేదు. ఏకైక రాజధాని అంటేనే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ అమరావతిలోనే ఉంచాలని కదా అర్ధం. మరి ఇపుడు ప్రొద్దుటూరులో మాట్లాడిన సోము వీర్రాజు కర్నూలులో హైకోర్టు ఉండాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి ?

Satya

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

15 minutes ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

30 minutes ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

1 hour ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

1 hour ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

2 hours ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

2 hours ago