Political News

షర్మిల కోరిక తీరినట్లేనా ?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల విషయమే హాట్ టాపిక్ అయిపోయింది.

ఇక్కడ విషయం ఏమిటంటే ఇంతకాలం తెలంగాణలో వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా మిగిలిన పార్టీలేవీ గుర్తించలేదు. షర్మిల పాదయాత్ర చేస్తున్నా, ఉద్యోగాల భర్తీ డిమాండుతో వారంలో ఒక్కరోజు దీక్షలు చేస్తున్నా ఏ పార్టీ కూడా షర్మిలను అసలు గుర్తించటానికే ఇష్టపడటంలేదు. ఇలాంటి నేపధ్యంలోనే కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగులో మొదటిసారి షర్మిల పార్టీకి ఆహ్వానం అందింది.

తర్వాత మరే పార్టీ నుంచి కూడా వైఎస్సార్టీపికి ఆహ్వానాలు అందలేదు. అలాంటిది ఇపుడు మంత్రులు ఆమెపై ఫిర్యాదు చేశారంటేనే వైఎస్సార్టీపీని మంత్రులు గుర్తిస్తున్నట్లే కదా ? షర్మిలపై మంత్రులు చేసిన ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేరే విషయం. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిదే తప్పంతా. షర్మిలను పట్టుకుని మంత్రి ఎగతాళిగా మాట్లాడుతు మంగళవారం మరదలు అని కామెంట్ చేశారు. దాంతో షర్మిల మంత్రిపై రెచ్చిపోయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం కాస్త బాగా పెద్దదైపోయింది.

ఆ తర్వాత మరికొందరు మంత్రులపైన కూడా షర్మిల అవినీతి ఆరోపణలు చేయటమే కాకుండా రెగ్యులర్ గా కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మంత్రులపై షర్మిల చేసిన ఆరోపణల్లాంటివే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా చేస్తున్నారు. వాళ్ళెవరికీ సభా హక్కుల నోటీసులు ఇవ్వాలని మంత్రులకు అనిపించలేదు. సో ఏదేమైనా షర్మిలకు ఒక్కసారిగా తెలంగాణాలో బాగా గుర్తింపు వచ్చేసిందనే అనుకోవాలి.

This post was last modified on September 15, 2022 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ ‘దక్షిణాది గళం’ బలమెంత..?

నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…

1 hour ago

ఓజీ-2 ప‌నిలో సుజీత్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక‌, ఆయ‌న చేసిన చిత్రాల్లో అభిమానుల‌ను అత్యంత అల‌రించింది ఓజీనే. సినిమా…

2 hours ago

రాముడు రావణుడు కలవడం లేదు

ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…

2 hours ago

పార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతం

ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…

2 hours ago

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…

3 hours ago

ఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూ

శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…

4 hours ago