Political News

షర్మిల కోరిక తీరినట్లేనా ?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల విషయమే హాట్ టాపిక్ అయిపోయింది.

ఇక్కడ విషయం ఏమిటంటే ఇంతకాలం తెలంగాణలో వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా మిగిలిన పార్టీలేవీ గుర్తించలేదు. షర్మిల పాదయాత్ర చేస్తున్నా, ఉద్యోగాల భర్తీ డిమాండుతో వారంలో ఒక్కరోజు దీక్షలు చేస్తున్నా ఏ పార్టీ కూడా షర్మిలను అసలు గుర్తించటానికే ఇష్టపడటంలేదు. ఇలాంటి నేపధ్యంలోనే కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగులో మొదటిసారి షర్మిల పార్టీకి ఆహ్వానం అందింది.

తర్వాత మరే పార్టీ నుంచి కూడా వైఎస్సార్టీపికి ఆహ్వానాలు అందలేదు. అలాంటిది ఇపుడు మంత్రులు ఆమెపై ఫిర్యాదు చేశారంటేనే వైఎస్సార్టీపీని మంత్రులు గుర్తిస్తున్నట్లే కదా ? షర్మిలపై మంత్రులు చేసిన ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేరే విషయం. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిదే తప్పంతా. షర్మిలను పట్టుకుని మంత్రి ఎగతాళిగా మాట్లాడుతు మంగళవారం మరదలు అని కామెంట్ చేశారు. దాంతో షర్మిల మంత్రిపై రెచ్చిపోయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం కాస్త బాగా పెద్దదైపోయింది.

ఆ తర్వాత మరికొందరు మంత్రులపైన కూడా షర్మిల అవినీతి ఆరోపణలు చేయటమే కాకుండా రెగ్యులర్ గా కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మంత్రులపై షర్మిల చేసిన ఆరోపణల్లాంటివే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా చేస్తున్నారు. వాళ్ళెవరికీ సభా హక్కుల నోటీసులు ఇవ్వాలని మంత్రులకు అనిపించలేదు. సో ఏదేమైనా షర్మిలకు ఒక్కసారిగా తెలంగాణాలో బాగా గుర్తింపు వచ్చేసిందనే అనుకోవాలి.

This post was last modified on September 15, 2022 11:44 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

57 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

4 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago