గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో జీవీ ఆంజనేయులుకు టికెట్ కన్ ఫర్మయ్యిందని సమాచారం. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశంలో మాజీ ఎంఎల్ఏ జీవీ కృషిని అభినందించారు. 2014లో జీవీ పార్టీ తరపున మొదటి సారి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటినుండి పార్టీ కార్యక్రమాలను ముందుండి బాగానే నడుపుతున్నారు.
ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపును జీవీ నాయకత్వంలో పార్టీ క్యాడరంతా బాగా స్పందిస్తున్నట్లు చంద్రబాబు అభినందించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో శావల్యాపురం జడ్పీటీసీ స్ధానాన్ని పార్టీ గెలవటంలో జీవీ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ముఖాముఖిలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్పారట.
2014 ఎన్నికల్లో గెలిచినపుడు వచ్చిన మెజారిటీ కన్నా రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీ రావాలని చంద్రబాబు టార్గెట్ పెట్టారు. నియోజకవర్గంలోని నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా జీవీకి ఎలాంటి లోటు లేదు. కాబట్టి అధికార పార్టీ అభ్యర్ధికి ధీటుగా ఎంతైనా ఖర్చలు పెట్టగల కెపాసిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులకు ప్రధానంగా కావాల్సింది ఆర్ధిక అండదండలే.
ఇపుడు చంద్రబాబు ఫైనల్ చేస్తున్న అభ్యర్ధులను కూడా జాగ్రత్తగా ఫైనల్ చేస్తున్నారు. ఆర్ధికంగా బాగా స్ధితిమంతులనే చూసుకుని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. కడప, రాజంపేట లోక్ సభలకు అభ్యర్ధులుగా ప్రకటించిన శ్రీనివాసులరెడ్డి, నరహరి కూడా ఆర్ధికంగా గట్టివారే. అలాగే డోన్, పుంగనూరు, పులివెందుల అసెంబ్లీలకు ప్రకటించిన అభ్యర్ధులు కూడా ఆర్ధికంగా బలమైన వారే. కాబట్టి అన్నీ కోణాలను పరిశీలించిన తర్వాతే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల్లో కచ్చితంగా వీళ్ళకు టికెట్ కోసం పోటీలేదు అని అనుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తానికి మెల్లిమెల్లిగా అభ్యర్ధులను చంద్రబాబు ఫైనల్ చేస్తున్నది వాస్తవం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…