Political News

మూడు ముచ్చ‌ట ఇక లేన‌ట్టే.. మంత్రి మాటల్లో చెప్పేశారుగా…!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట లేన‌ట్టేనా? ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌నా కాలంలో మూడు రాజ‌ధానులు పూర్తి అయ్యే ప‌రిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. ఏపీ ప్ర‌భుత్వం 2020 నుంచి కూడా మూడు రాజ‌ధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదిక‌గానే మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న చేసిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని కేవలం శాస‌న రాజ‌ధానిగానే ఉంచుతామ‌న్నారు.

ఇక‌, దీనిపై న్యాయ వివాదాలు ముసురుకున్నాయి. రైతులు ఉద్య‌మం చేశారు. పాద‌యాత్ర చేశారు.. ప్ర‌స్తుతం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం తాను మూడు నుంచి వెన‌క్కి త‌గ్గే దేలేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల హైకోర్టు అమ‌రావతినే రాజ‌ధాని చేయాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసి తీరాల‌ని కూడా స్ప‌ష్టం చేసిం ది. దీనికి మూడు మాసాల స‌మ‌యం ఇచ్చింది. అయితే.. ఇది దాటిపోయింది.

అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌నే చెప్పుకొచ్చారు. ఇక‌, రేపోమాపో.. సీఎం జ‌గ‌న్‌.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభిస్తార‌ని కూడా కొంద‌రు నాయ‌కులు క్లూ ఇస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌… జ‌గ‌న్ హ‌యాంలో ఈ రెండేళ్ల కాలంలోనే జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడురాజ‌ధానుల అంశ‌మే ప్ర‌ధాన అజెండా అవుతుంద‌ని తెలిపారు.

తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ స‌ర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు తోడు.. మూడు రాజ‌ధానుల అంశాన్ని కూడా అజెండాలో పెడ‌తామ‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తామ‌ని చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మూడు రాజ‌ధానుల విష‌యంలో ఎలాంటి అడుగు ప‌డ‌బోద‌ని.. స్ప‌ష్టంగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి..అప్పుడు మ‌రోసారి గెలిచి.. ఆ త‌ర్వాత‌.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాకుండా త‌మ‌పంతం నెగ్గించుకోవాల‌ని..వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఇదీ సంగ‌తి!

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

7 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

13 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

27 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago