Political News

మూడు ముచ్చ‌ట ఇక లేన‌ట్టే.. మంత్రి మాటల్లో చెప్పేశారుగా…!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట లేన‌ట్టేనా? ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌నా కాలంలో మూడు రాజ‌ధానులు పూర్తి అయ్యే ప‌రిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. ఏపీ ప్ర‌భుత్వం 2020 నుంచి కూడా మూడు రాజ‌ధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదిక‌గానే మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న చేసిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని కేవలం శాస‌న రాజ‌ధానిగానే ఉంచుతామ‌న్నారు.

ఇక‌, దీనిపై న్యాయ వివాదాలు ముసురుకున్నాయి. రైతులు ఉద్య‌మం చేశారు. పాద‌యాత్ర చేశారు.. ప్ర‌స్తుతం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం తాను మూడు నుంచి వెన‌క్కి త‌గ్గే దేలేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల హైకోర్టు అమ‌రావతినే రాజ‌ధాని చేయాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసి తీరాల‌ని కూడా స్ప‌ష్టం చేసిం ది. దీనికి మూడు మాసాల స‌మ‌యం ఇచ్చింది. అయితే.. ఇది దాటిపోయింది.

అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌నే చెప్పుకొచ్చారు. ఇక‌, రేపోమాపో.. సీఎం జ‌గ‌న్‌.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభిస్తార‌ని కూడా కొంద‌రు నాయ‌కులు క్లూ ఇస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌… జ‌గ‌న్ హ‌యాంలో ఈ రెండేళ్ల కాలంలోనే జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడురాజ‌ధానుల అంశ‌మే ప్ర‌ధాన అజెండా అవుతుంద‌ని తెలిపారు.

తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ స‌ర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు తోడు.. మూడు రాజ‌ధానుల అంశాన్ని కూడా అజెండాలో పెడ‌తామ‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తామ‌ని చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మూడు రాజ‌ధానుల విష‌యంలో ఎలాంటి అడుగు ప‌డ‌బోద‌ని.. స్ప‌ష్టంగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి..అప్పుడు మ‌రోసారి గెలిచి.. ఆ త‌ర్వాత‌.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాకుండా త‌మ‌పంతం నెగ్గించుకోవాల‌ని..వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఇదీ సంగ‌తి!

This post was last modified on September 14, 2022 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

3 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

5 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

5 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

6 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

8 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

8 hours ago