Political News

పాదయాత్రను అడ్డుకోవటం మూర్ఖత్వమేనా ?

అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రను విశాఖపట్నంలో అడ్డుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఒకవేళ విశాఖపట్నాన్ని పాదయాత్ర దాటినా శ్రీకాకుళం పొలిమేరలోనే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. పలాసలో జరిగిన ఒక సమావేశంలో సీదిరి పై ప్రకటన, హెచ్చరిక చేయటం విచిత్రంగా ఉంది. మంత్రయ్యుండి ఇలాంటి ప్రకటనలు చేయటమే తప్పు. పాదయాత్రలు చేసుకునే హక్కు అమరావతి జేఏసీకి ఉందన్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు.

పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య వస్తే అప్పుడు నిర్వాహకులపై పోలీసులే యాక్షన్ తీసుకుంటారు. అంతేకానీ పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రే చెప్పటం విచిత్రంగానే ఉంది. అధికార పార్టీ నేతలు పాదయాత్రను అడ్డుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. అడ్డుకోవటం వల్ల గొడవలు జరిగితే పాదయాత్రకు వైసీపీనే మరింత ప్రచారం చేసినట్లవుతుంది. ఇంతమాత్రందానికి అడ్డుకోవటం, గొడవలు చేయటం వైసీపీకి అవసరమా ?

అమరావతిలో పాదయాత్ర మొదలుపెట్టిన నిర్వాహకులు అరసవల్లికి చేరుకుంటారు. చేరుకుంటే ఏమవుతుంది దర్శనం చేసుకుని వెనక్కు తిరుగుతారు. ఈ మాత్రానికి మంత్రి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. పాదయాత్ర సజావుగా జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. తమ ప్రభుత్వానికి మంచిపేరు రావాలా ? లేదా చెడ్డ పేరు రావాలా ? అన్నది మంత్రే తేల్చుకోవాలి. పాదయాత్ర గురించి అధికార పార్టీ అసలు పట్టించుకోకపోతే ఎలాంటి సమస్యలుండవన్న విషయాన్ని సీదిరి గుర్తుంచుకోవాలి.

పాదయాత్ర సందర్భంగా నిర్వాహకులు, యాత్రలో పాల్గొన్నవారు ప్రభుత్వంపై ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకే నష్టం వస్తుంది కానీ అధికారపార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు. చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న ఏకైక అమరావతా ? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులా అన్నది తేల్చటం జనాలపైనే ఉంది. వచ్చే ఎన్నికల వరకు ఈ విషయాన్ని అందరు పక్కనపెట్టేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. పాదయాత్ర చేసినంత మాత్రాన అమరావతే రాజధాని అయిపోదు. ఇదే సమయంలో జగన్ ప్రతిపాదించినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటూ సాధ్యంకాదు. మరీమాత్రానికి గొడవలెందుకు ?

This post was last modified on September 14, 2022 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

16 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

56 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago