Political News

ఆ వైసీపీ ఎమ్మెల్యేల‌ను సొంత పార్టీ నేత‌లే ఓడిస్తారా…!

ఎక్క‌డైనా ఏ పార్టీ నేత‌లైనా.. త‌మ పార్టీని.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇది స‌హ‌జం కూడా. అధిష్టానం ఆదేశాలు ఉన్నా..లేకున్నా.. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బడ్డా.. త‌మ‌కు ఉపయోగ‌ప‌డతారు.. గెలిపిస్తే.. పోలా! అనేలా వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే.. వైసీపీ విష‌యంలో మాత్రం ఈ ప‌రిస్థితి రివ‌ర్స్ అవుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను ఓడించేందుకు సొంత పార్టీ నాయ‌కులే రెడీ అవుతున్నార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ అధికార పార్టీలోనే ఎక్కువ‌గా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గుంటూరు విష‌యానికి వ‌స్తే.. స‌త్తెన‌ప‌ల్లి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా పెద‌కూర‌పాడు, వినుకొండ నియోజ‌క‌వ‌ర్గాలు అయితే.. దాదాపు ఓడించే నియోజ‌క‌వ‌ర్గాల జాబితాలో చేరిపోయాయ‌ని అంటున్నారు. ఆయా నియోజ‌క‌వర్గాల్లో ఎమ్మెల్యేల వల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించేసుకున్నారు. అంతేకాదు.. మ‌రోసారి వీరిని గెలిపిస్తే.. ఇక‌, త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. త‌మ అడ్ర‌స్‌లు కూడా గ‌ల్లంత‌వుతాయ‌ని భావిస్తున్నార‌ట‌.

దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌ను ఓడించేందుకు నాయ‌కులు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే త‌ర‌హా వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మైలవరంలో అయితే..ఎమ్మెల్యే సొంత సామాజిక వ‌ర్గంకారాలు మిరియాలు నూరుతోంది. త‌మ‌ను ఎన్నిక‌ల్లో వాడుకుని.. త‌ర్వాత వ‌దిలేశార‌ని.. దొడ్డిదారుల్లో సొమ్ములు పోగేసుకుంటున్నార‌ని.. నాయ‌కులు వాద‌న వినిపిస్తున్నారు. దీంతో మైల‌వ‌రంలో మ‌ళ్లీ వ‌సంత‌కు టికెట్ ఇవ్వ‌ద్ద‌ని.. ఇస్తే.. ఓటమి ఖాయ‌మ‌ని .. కీల‌క నేత‌లు వాదిస్తున్నారు.

ఇక‌, జ‌గ‌య్య‌పేట‌లోనూ ఇదే వాద‌న వినిపిస్తోంది. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోండి సారూ! అని ఎమ్మెల్యే సామినేనికి ఇక్క‌డి నాయ‌కులు మొర పెట్టుకుంటున్నా.. ఆయ‌న మాత్రం వీరిని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో వారంతా సామినేనికి యాంటి అయ్యార‌ని తెలుస్తోంది. ఇక‌, గ‌న్న‌వ‌రం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా ఎక్కువే. ఇక్క‌డ త‌మ‌కు మాత్ర‌మే టికెట్ ఇవ్వాలని.. యార్ల‌గ‌డ్డ‌, దుట్టాలు.. ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రో వాద‌న తెర‌మీద‌కిఇ తెచ్చారు. మాకు ఇవ్వ‌క‌పోయినా.. ఫ‌ర్లేదు.. వంశీకి మాత్రం ఇవ్వ‌డానికి వీల్లేద‌ని తీర్మానాలు చేశారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీని ప్ర‌త్యేకంగా టీడీపీ నేత‌లు ఓడించే ప్ర‌య‌త్నం చేయ‌డం అవ‌స‌రం లేద‌ని.. వైసీపీ నేత‌లే ఓడిస్తార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on September 15, 2022 10:07 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

3 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

4 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

10 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

11 hours ago