తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అక్కడక్కడ చంద్రబాబునాయుడు ప్రకటించేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థి ఎంపిక దాదాపు ఖాయమైనా వివిధ కారణాల వల్ల బహిరంగంగా ప్రకటించటం లేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. ఇప్పటికే రాజంపేట, కడప పార్లమెంటు అభ్యర్థులతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక విషయానికి వస్తే నరసరావుపేట లోక్ సభ స్ధానంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీచేయటం దాదాపు ఖాయమైనట్లేనట. పుట్టా మహేష్ ఎవరంటే కడపజిల్లాలోని మైదుకూరు మాజీ ఎంఎల్ఏ పుట్టా సుధాకరయాదవ్ కొడుకు+యనమల రామకృష్ణుడు అల్లుడు. కోరుకున్న నియోజకవర్గంలో టికెట్ సాధించుకునేందుకు మహేష్ కు ఇంతకన్నా అర్హతలు ఏమికావాలి ? పైగా ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉండటమే కాకుండా యువకుడు కూడా.
సో అన్నీ కోణాల్లోను కలిసొచ్చి నరసరావుపేట పార్లమెంటులో మహేష్ పోటీచేయటం దాదాపు ఫైనల్ అయినట్లే అనుకోవాలి. నియోజకవర్గంలో బీసీ ప్రధానంగా యాదవ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. మాచర్ల, గురజాల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు బాగా ఎక్కువగా ఉన్నాయట. ఈ కారణంగా యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధినే పోటీలోకి దింపితే గెలుపు గ్యారెంటీ అని సర్వేల్లో తేలిందని సమాచారం. అందుకనే మహేష్ క్యాండిడేచర్ పై చంద్రబాబునాయుడు కూడా కసరత్తు చేశారు.
సో అన్నీ అవకాశాలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మహేష్ పోటీచేయటం ఖాయమనే అనుకోవాలి. ఇదే సమయంలో యనమలకు అల్లుడే స్వయంగా పోటీ విషయంలో ఆసక్తిగా ఉన్నారంటే వేరే నేతలు టికెట్ విషయంలో ప్రయత్నం చేయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే చంద్రబాబు కూడా యనమలను కాదని ఇతరులకు పెద్దగా వెయిట్ ఇవ్వరు కాబట్టి. సో మరో పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీకి గట్టి అభ్యర్ధి దొరికినట్లేనా ?
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…