Political News

నరసరావుపేట టికెట్ ఫైనల్ అయినట్లేనా ?

తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అక్కడక్కడ చంద్రబాబునాయుడు ప్రకటించేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థి ఎంపిక దాదాపు ఖాయమైనా వివిధ కారణాల వల్ల బహిరంగంగా ప్రకటించటం లేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. ఇప్పటికే రాజంపేట, కడప పార్లమెంటు అభ్యర్థులతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక విషయానికి వస్తే నరసరావుపేట లోక్ సభ స్ధానంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీచేయటం దాదాపు ఖాయమైనట్లేనట. పుట్టా మహేష్ ఎవరంటే కడపజిల్లాలోని మైదుకూరు మాజీ ఎంఎల్ఏ పుట్టా సుధాకరయాదవ్ కొడుకు+యనమల రామకృష్ణుడు అల్లుడు. కోరుకున్న నియోజకవర్గంలో టికెట్ సాధించుకునేందుకు మహేష్ కు ఇంతకన్నా అర్హతలు ఏమికావాలి ? పైగా ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉండటమే కాకుండా యువకుడు కూడా.

సో అన్నీ కోణాల్లోను కలిసొచ్చి నరసరావుపేట పార్లమెంటులో మహేష్ పోటీచేయటం దాదాపు ఫైనల్ అయినట్లే అనుకోవాలి. నియోజకవర్గంలో బీసీ ప్రధానంగా యాదవ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. మాచర్ల, గురజాల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు బాగా ఎక్కువగా ఉన్నాయట. ఈ కారణంగా యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధినే పోటీలోకి దింపితే గెలుపు గ్యారెంటీ అని సర్వేల్లో తేలిందని సమాచారం. అందుకనే మహేష్ క్యాండిడేచర్ పై చంద్రబాబునాయుడు కూడా కసరత్తు చేశారు.

సో అన్నీ అవకాశాలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మహేష్ పోటీచేయటం ఖాయమనే అనుకోవాలి. ఇదే సమయంలో యనమలకు అల్లుడే స్వయంగా పోటీ విషయంలో ఆసక్తిగా ఉన్నారంటే వేరే నేతలు టికెట్ విషయంలో ప్రయత్నం చేయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే చంద్రబాబు కూడా యనమలను కాదని ఇతరులకు పెద్దగా వెయిట్ ఇవ్వరు కాబట్టి. సో మరో పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీకి గట్టి అభ్యర్ధి దొరికినట్లేనా ?

This post was last modified on September 13, 2022 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

4 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

8 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago