తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టిన షర్మిల.. పార్టీతో ప్రజల కు రాజన్న రాజ్యం తెస్తుందో తెలియదు కానీ.. ‘ఫ్రస్టేషన్ రాజ్యం’ మాత్రం తెచ్చేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆమె.. ఒకింత అదుపు తప్పి కామెంట్లు కుమ్మరిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఎప్పుడో.. పేరు చెప్పకుండానే.. మంత్రి జగదీశ్వర్రెడ్డి.. ‘మరదలు’ అని కామెంట్ చేశారు. అయితే.. అప్పట్లో దీనిపై ఫోకస్ చేయని.. షర్మిల.. రెండు రోజుల కిందట రియాక్ట్ అయ్యారు.
‘ఎవర్రా’ అంటూ.. దూషణలకు దిగారు. ఇక, తాజాగా కూడా ఆమె నోరు పారేసుకున్నారు. తాను తెలంగాణలోనే పుట్టానని, వైఎస్ సంక్షేమ పాలనను తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టామని షర్మిల అన్నారు. “నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే పెరిగా. ఇక్కడే చదువుకున్నా. ఈ గడ్డ కూడే తిన్నా. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తేవడం కోసమే పార్టీ పెట్టా. నాది తెలంగాణ కాదనేది ఎవర్రా? ఇది నా తెలంగాణ, మన తెలంగాణ” అని అదుపు తప్పి వ్యాఖ్యలు చేశారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్నగర్ జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇలా ఎందుకు షర్మిల రూట్ తప్పుతున్నారనే విషయంపై నెటిజన్లు కూడా ఆసక్తిగానే రియాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రదాన కారణం.. ఆమె పాదయాత్రకు ఆశించిన కవరేజీ రావడం లేదు. ప్రజల్లోనూ ఎక్కడా టాక్ వినిపించడం లేదు. ఇది ఒక కారణమైతే.. ఎన్నికలు సమీపిస్తున్నా.. ఎప్పుడు ఏ క్షణంలో ప్రకటన వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నా.. కనీసం పట్టుమని పది నియోజకవర్గాల్లో అయినా.. నాయకులను నిలబెట్టే స్థాయిలో షర్మిల లేరు.
అందుకే.. అన్నీ కలిపి.. ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని .. అంటున్నారు నెటిజన్లు. అయితే.. ఇవన్నీ వర్కవుట్ కావని.. నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తెలంగాణ భూమితో సంబంధం అంటే.. ఇక్కడిఉద్యమంతో సంబంధం ఉండాలి. ఇక్కడి గాలితో నీటితో.. సంబంధం ఉండాలని.. మధ్యలో వచ్చి.. ఇలా సెంటిమెంటును రగిలించేందుకో.. లేక.. సంచలన వ్యాఖ్యలు చేసి.. గుర్తింపు పొందేందుకో ప్రయత్నిస్తే.. ఫలితం ఉండదని వారు నిర్మొహమాటంగానే సెలవిస్తున్నారు. మరి షర్మిల .. అధికారంలోకి రాకముందే.. ఫ్రస్ట్రేషన్కు గురైతే.. వచ్చాక.. ఏం చేస్తారో.. అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…