మొత్తానికి కేసీయార్ కు ఒక పార్టీ మద్దతు ప్రకటించింది. ఆదివారం ప్రగతి భవన్లో కేసీయార్ ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీయార్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. కేసీయార్ లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఇపుడు చాలా అవసరముందన్నారు. దసరా పండుగ లోపలే తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు తనతో కేసీయార్ చెప్పారని కుమారస్వామి చెప్పారు.
సో కుమారస్వామి చెప్పినదాన్ని బట్టి చూస్తే కేసీయార్ కు జేడీఎస్ మద్దతు ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే జాతీయ రాజకీయాల్లో జేడీఎస్ బలమేంటి ? ఈ పార్టీకున్న స్ధాయి ఏమిటన్నది కీలకమైంది. ఎందుకంటే కర్నాటకలోనే జేడీఎస్ దెబ్బతినేసింది. తన పార్టీలోని ఎంఎల్ఏలను బీజేపీ లాగేసుకుంటే కుమారస్వామి ఆపలేక ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో జేడీఎస్ పాత్ర దాదాపు నిల్లనే చెప్పాలి.
ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. అదేమిటంటే కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మిత్రపక్షాలు. రెండుపార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే బీజేపీ వ్యూహాల కారణంగా ప్రభుత్వం అర్ధాంతరంగా కూలిపోయింది. జాతీయ స్ధాయిలో కూడా కాంగ్రెస్ కు జేడీఎస్ మద్దతుగానే నిలబడుతోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ కు జేడీఎస్ మద్దతు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీని కేసీయార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకో సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీఎస్ కేసీయార్ కు మద్దతు ప్రకటించింది.
మరి మద్దతు ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణాలో కేసీయార్ జేడీఎస్ కు సీట్లిస్తారా ? లేకపోతే జేడీఎస్సే కర్నాటకలో టీఆర్ఎస్ కు కొన్ని సీట్లు కేటాయిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. జాతీయపార్టీగా విస్తరించాలని అనుకుంటున్న కేసీయార్ ఇతర రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీలోకి దింపకపోతే ఉపయోగముండదు. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటారనేది సస్పెన్సుగా మారింది.
This post was last modified on September 12, 2022 12:46 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…