Political News

బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నదా ?

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కీలకమైన నిర్ణయం ఏమిటంటే సీనియర్లందరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలనట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీలోకి దింపాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయట.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గట్టి అభ్యర్ధులు లేకపోతే ఇక 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఎక్కడినుండి వస్తారు ? గట్టి అభ్యర్ధుల కొరతను భర్తీ చేసుకోవటానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని నేతలకు గాలమేస్తోంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలామంది నేతల్లో కొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి వలసొచ్చిన వాళ్ళే.

ఇలాంటి వలస నేతలు కూడా లేకపోతే బీజేపీ పరిస్థితి గోవిందాయే. అందుకనే బయట పార్టీల నుండి నేతలను నమ్ముకుంటే కష్టమని సీనియర్లందరినీ పోటీలోకి దింపాలని అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. ఇలాంటి మోడల్ నే మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రయోగించి సక్సెస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో కూడా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను పోటీ చేయించింది. వీరిలో కొందరు ఓడిపోగా మరికొందరు గెలిచారు.

సో అలాంటి ప్రయోగమే రేపు తెలంగాణాలో కూడా అమలు చేయాలని నిర్ణయించుకుందట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేములవాడ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ నుండి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు బోధన్ నుండి, కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నుండి పోటీచేయటానికి రెడీ అవుతున్నారట. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్, డీకే అరుణ గద్వాల, విజయశాంతి మెదక్ లేదా గ్రేటర్ హైదరాబాద్ లోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారట.

This post was last modified on September 12, 2022 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

1 hour ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

1 hour ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

2 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

3 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

3 hours ago

కన్నడ హీరోయిన్ ప్రశ్న… జవాబు చెప్పగలమా?

దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…

3 hours ago