Political News

బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నదా ?

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కీలకమైన నిర్ణయం ఏమిటంటే సీనియర్లందరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలనట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీలోకి దింపాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయట.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గట్టి అభ్యర్ధులు లేకపోతే ఇక 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఎక్కడినుండి వస్తారు ? గట్టి అభ్యర్ధుల కొరతను భర్తీ చేసుకోవటానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని నేతలకు గాలమేస్తోంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలామంది నేతల్లో కొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి వలసొచ్చిన వాళ్ళే.

ఇలాంటి వలస నేతలు కూడా లేకపోతే బీజేపీ పరిస్థితి గోవిందాయే. అందుకనే బయట పార్టీల నుండి నేతలను నమ్ముకుంటే కష్టమని సీనియర్లందరినీ పోటీలోకి దింపాలని అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. ఇలాంటి మోడల్ నే మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రయోగించి సక్సెస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో కూడా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను పోటీ చేయించింది. వీరిలో కొందరు ఓడిపోగా మరికొందరు గెలిచారు.

సో అలాంటి ప్రయోగమే రేపు తెలంగాణాలో కూడా అమలు చేయాలని నిర్ణయించుకుందట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేములవాడ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ నుండి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు బోధన్ నుండి, కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నుండి పోటీచేయటానికి రెడీ అవుతున్నారట. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్, డీకే అరుణ గద్వాల, విజయశాంతి మెదక్ లేదా గ్రేటర్ హైదరాబాద్ లోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారట.

This post was last modified on September 12, 2022 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

3 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

7 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

9 hours ago