ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గలేసింది. అది కూడా అత్యంత కీలకమైన, సీరియస్ కార్యక్రమం భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలో ఆయన తెగ సిగ్గుపడిపోయారు. దీనికి కారణం.. ఈ యాత్ర సమయంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్రస్తావన రావడమే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం
అంటూ.. తమిళనాడు మహిళ లు అనూహ్యమైన ఆఫర్ ఇవ్వడమే. దీంతో ఆయన బిడియంతో కూడిన సిగ్గుతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. ఉపాధి హామీ పథకాన్ని తమ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలోనే తీసుకువచ్చిన సంగతి తెలుసా? తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే… మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. “మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మా అమ్మాయి.. మా తమిళనాడుకు చెందిన యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమంటారు? ఇష్టమైతే చెప్పండి.. మేం వచ్చి.. మీ అమ్మగారితో మాట్లాడతాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. అయితే.. దీనికి రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పేలేదు.
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారట రాహుల్. అంతేకాదు.. ఆయన ముఖంలో బిడియంతో కూడిన సిగ్గు స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. మహిళలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, వారితో రాహుల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్కు జత చేశారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on September 11, 2022 9:49 pm
పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…
2009 సెప్టెంబరులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ…
టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అనంతరం పశ్చిమ…
తెలంగాణ ప్రతిపక్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని వారాల కిందట కఠిన చర్యలు తీసుకున్న విషయం…
వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నారని.. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకోవడం లేదని..…
అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…