Rahul Gandhi
ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గలేసింది. అది కూడా అత్యంత కీలకమైన, సీరియస్ కార్యక్రమం భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలో ఆయన తెగ సిగ్గుపడిపోయారు. దీనికి కారణం.. ఈ యాత్ర సమయంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్రస్తావన రావడమే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం అంటూ.. తమిళనాడు మహిళ లు అనూహ్యమైన ఆఫర్ ఇవ్వడమే. దీంతో ఆయన బిడియంతో కూడిన సిగ్గుతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. ఉపాధి హామీ పథకాన్ని తమ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలోనే తీసుకువచ్చిన సంగతి తెలుసా? తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే… మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. “మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మా అమ్మాయి.. మా తమిళనాడుకు చెందిన యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమంటారు? ఇష్టమైతే చెప్పండి.. మేం వచ్చి.. మీ అమ్మగారితో మాట్లాడతాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. అయితే.. దీనికి రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పేలేదు.
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారట రాహుల్. అంతేకాదు.. ఆయన ముఖంలో బిడియంతో కూడిన సిగ్గు స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. మహిళలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, వారితో రాహుల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్కు జత చేశారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on September 11, 2022 9:49 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…