Rahul Gandhi
ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గలేసింది. అది కూడా అత్యంత కీలకమైన, సీరియస్ కార్యక్రమం భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలో ఆయన తెగ సిగ్గుపడిపోయారు. దీనికి కారణం.. ఈ యాత్ర సమయంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్రస్తావన రావడమే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం అంటూ.. తమిళనాడు మహిళ లు అనూహ్యమైన ఆఫర్ ఇవ్వడమే. దీంతో ఆయన బిడియంతో కూడిన సిగ్గుతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. ఉపాధి హామీ పథకాన్ని తమ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలోనే తీసుకువచ్చిన సంగతి తెలుసా? తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే… మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. “మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మా అమ్మాయి.. మా తమిళనాడుకు చెందిన యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమంటారు? ఇష్టమైతే చెప్పండి.. మేం వచ్చి.. మీ అమ్మగారితో మాట్లాడతాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. అయితే.. దీనికి రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పేలేదు.
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారట రాహుల్. అంతేకాదు.. ఆయన ముఖంలో బిడియంతో కూడిన సిగ్గు స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. మహిళలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, వారితో రాహుల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్కు జత చేశారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on September 11, 2022 9:49 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…