ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. కొత్త రాజకీయాలు తెరమీదికి వస్తున్నాయని అంటున్నారు. గతంలో అధినేత చంద్రబాబు పట్ల విధేయత ప్రదర్శించే నాయకులు ఉండేవారు. అదే సమయంలో పార్టీకి గైడ్ చేసే నాయకులు కూడా కనిపించేవారు. అయితే.. ఇప్పుడు సీనియర్లు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఒక్క కోస్తా ప్రాంతంలోనే.. సీనియర్లుగా ఉన్న బుచ్చయ్య చౌదరి..యనమల రామకృష్ణుడు.. వంటివారు కనిపిస్తున్నారు.
వీరు కూడా.. అడపాదడపా.. వ్యాక్యలు చేయడం.. ప్రభుత్వంపై ఏదో రెండు మూడు కామెంట్లు చేయడం.. వరకే పరిమితం అవుతున్నారు. ఫలితంగా.. పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉందనేది ఒక చర్చ. ఇదిలావుంటే.. ఇతర ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల్లో ఇది కూడా లేదని అంటున్నారు. అంటే.. అటు వైపు ప్రాంతాల్లో.. కనీసం.. మీడియా ముందుకు వస్తున్న వారు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. ఉత్తరాంధ్రను తీసుకుంటే.. విజయనగరంలో టీడీపీ నేతల వాయిస్ వినిపించడం లేదు.
విశాఖలో అసలు పార్టీకి నాయకులు.. ఉన్నారా? లేరా? ఉంటే ఏం చేస్తున్నారు? అనేది.. చంద్రబాబుకైనా తెలుసో లేదో.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో మాత్రం అచ్చన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. మిగిలిన వారు ముక్త సరిగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, సీమలోకి వస్తే.. నాయకులు పెద్దగా ముందుకు రావడం లేదు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వెళ్తే.. పండగ లేకపోతే.. దండగ అన్నట్టుగా ఉంది.
నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి..అమర్నాథ్రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన సైలెంట్ అయ్యారు. నల్లారి కిశోర్కుమార్ కూడా పెద్దగా యాక్టివ్ కాలేక పోతున్నారు. కర్నూలులో నాయకుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. అనంతలో కాల్వ, పరిటాల ఫ్యామిలీలే.. అంతో ఇంతో దూకుడుగా ఉన్నాయి. కడపలో ఆదినారాయణరెడ్డి దూకుడు ప్రదర్శించినా.. కొంతవరకే పరిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. తెలుగు దేశం నాయకుల పరిస్థితి ఎప్పటికప్పుడు.. లెక్కలు వేసుకునే పరిస్థితికి వచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు.
This post was last modified on September 11, 2022 10:27 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…