Political News

కోస్తాలో ఇలా.. మిగిలిన చోట్ల అలా.. టీడీపీ నేత‌ల తీరిదే సారూ..!


ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. కొత్త రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. గ‌తంలో అధినేత చంద్ర‌బాబు ప‌ట్ల విధేయ‌త ప్ర‌ద‌ర్శించే నాయ‌కులు ఉండేవారు. అదే సమ‌యంలో పార్టీకి గైడ్ చేసే నాయ‌కులు కూడా క‌నిపించేవారు. అయితే.. ఇప్పుడు సీనియ‌ర్లు ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఒక్క కోస్తా ప్రాంతంలోనే.. సీనియ‌ర్లుగా ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి..య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. వంటివారు క‌నిపిస్తున్నారు.

వీరు కూడా.. అడ‌పాద‌డ‌పా.. వ్యాక్య‌లు చేయ‌డం.. ప్ర‌భుత్వంపై ఏదో రెండు మూడు కామెంట్లు చేయ‌డం.. వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. ఫ‌లితంగా.. పార్టీకి ఎలాంటి ప్ర‌యోజనం ఉంద‌నేది ఒక చ‌ర్చ‌. ఇదిలావుంటే.. ఇత‌ర ప్రాంతాలైన ఉత్త‌రాంధ్ర‌, సీమ జిల్లాల్లో ఇది కూడా లేద‌ని అంటున్నారు. అంటే.. అటు వైపు ప్రాంతాల్లో.. క‌నీసం.. మీడియా ముందుకు వ‌స్తున్న వారు కూడా క‌నిపించ‌డం లేదని చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌ను తీసుకుంటే.. విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ నేత‌ల వాయిస్ వినిపించ‌డం లేదు.

విశాఖ‌లో అస‌లు పార్టీకి నాయ‌కులు.. ఉన్నారా? లేరా? ఉంటే ఏం చేస్తున్నారు? అనేది.. చంద్ర‌బాబుకైనా తెలుసో లేదో.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో మాత్రం అచ్చ‌న్నాయుడు, ఎంపీ రామ్మోహ‌న్‌ వాయిస్ మాత్ర‌మే వినిపిస్తోంది. మిగిలిన వారు ముక్త స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక‌, సీమ‌లోకి వ‌స్తే.. నాయ‌కులు పెద్ద‌గా ముందుకు రావ‌డం లేదు. చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు వెళ్తే.. పండ‌గ లేక‌పోతే.. దండ‌గ అన్న‌ట్టుగా ఉంది.

నిన్న మొన్న‌టి వ‌రకు మాజీ మంత్రి..అమ‌ర్నాథ్‌రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సైలెంట్ అయ్యారు. న‌ల్లారి కిశోర్‌కుమార్ కూడా పెద్ద‌గా యాక్టివ్ కాలేక పోతున్నారు. క‌ర్నూలులో నాయ‌కుల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా ఉంది. అనంత‌లో కాల్వ‌, ప‌రిటాల ఫ్యామిలీలే.. అంతో ఇంతో దూకుడుగా ఉన్నాయి. క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కొంత‌వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. తెలుగు దేశం నాయ‌కుల ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు.. లెక్క‌లు వేసుకునే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 11, 2022 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

37 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

45 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago