Political News

కేసీయార్-మమత మధ్య పోటీ మొదలైందా ?

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీయార్-మమతా బెనర్జీ మధ్య పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బిజీగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ జాతీయపార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తేవటమే తన లక్ష్యమని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాల కూటమికి సారధ్య బాధ్యతలు తీసుకునే ఆలోచన తనకు లేదని బీహార్ సీఎం స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించటమే తన టార్గెట్ గా నితీష్ చెప్పారు. ఇదే విషయాన్ని కేసీయార్, మమత కూడా చెబుతున్నా అంతర్లీనంగా నాన్ ఎన్డీయే పార్టీల కూటమికి నాయకత్వం వహించాలన్న కోరిక బలంగా వారిలో కనబడుతోంది.

ఇక్కడే ఈ ఇద్దరికీ మిగిలిన పార్టీలతో పాటు యూపీఏకి సమస్యలు వస్తున్నాయి. సమస్య ఏమిటంటే ఇద్దరు కూడా నమ్మదగ్గ నేతలుకారు. ఎప్పుడు ఎలాగుంటారో ? ఎవరితో చేతులు కలుపుతారో కూడా మిగిలిన వాళ్ళు ఊహించలేరు. కేసీయార్, మమత గతచరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ తో తాను చర్చలు జరిపానని మమత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

హేమంత్ యూపీఏలో అధికారిక భాగస్వామి. యూపీఏ భాగస్వామి హోదాలో హేమంత్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకమే. ఇక ఈ సీఎంతో మమత కొత్తగా చర్చించేదేముంటుంది ? అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో నితీష్ బిజీగా ఉన్నారు. అలాంటిది నితీష్ తో మమత కొత్తగా మాట్లాడేదేముంటంది ? ఇక కేసీయార్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కాబట్టి నాన్ ఎన్డీయే పార్టీల బృందానికి నాయకత్వం వహించే విషయంలో కేసీయార్, మమత మధ్య పోటీ మొదలైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on September 10, 2022 2:12 pm

Share
Show comments

Recent Posts

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

47 minutes ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

3 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

6 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

8 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

10 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

13 hours ago