Political News

కేసీయార్-మమత మధ్య పోటీ మొదలైందా ?

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీయార్-మమతా బెనర్జీ మధ్య పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బిజీగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ జాతీయపార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తేవటమే తన లక్ష్యమని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాల కూటమికి సారధ్య బాధ్యతలు తీసుకునే ఆలోచన తనకు లేదని బీహార్ సీఎం స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించటమే తన టార్గెట్ గా నితీష్ చెప్పారు. ఇదే విషయాన్ని కేసీయార్, మమత కూడా చెబుతున్నా అంతర్లీనంగా నాన్ ఎన్డీయే పార్టీల కూటమికి నాయకత్వం వహించాలన్న కోరిక బలంగా వారిలో కనబడుతోంది.

ఇక్కడే ఈ ఇద్దరికీ మిగిలిన పార్టీలతో పాటు యూపీఏకి సమస్యలు వస్తున్నాయి. సమస్య ఏమిటంటే ఇద్దరు కూడా నమ్మదగ్గ నేతలుకారు. ఎప్పుడు ఎలాగుంటారో ? ఎవరితో చేతులు కలుపుతారో కూడా మిగిలిన వాళ్ళు ఊహించలేరు. కేసీయార్, మమత గతచరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ తో తాను చర్చలు జరిపానని మమత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

హేమంత్ యూపీఏలో అధికారిక భాగస్వామి. యూపీఏ భాగస్వామి హోదాలో హేమంత్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకమే. ఇక ఈ సీఎంతో మమత కొత్తగా చర్చించేదేముంటుంది ? అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో నితీష్ బిజీగా ఉన్నారు. అలాంటిది నితీష్ తో మమత కొత్తగా మాట్లాడేదేముంటంది ? ఇక కేసీయార్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కాబట్టి నాన్ ఎన్డీయే పార్టీల బృందానికి నాయకత్వం వహించే విషయంలో కేసీయార్, మమత మధ్య పోటీ మొదలైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on September 10, 2022 2:12 pm

Share
Show comments

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

28 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago