నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీయార్-మమతా బెనర్జీ మధ్య పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బిజీగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ జాతీయపార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.
నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తేవటమే తన లక్ష్యమని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాల కూటమికి సారధ్య బాధ్యతలు తీసుకునే ఆలోచన తనకు లేదని బీహార్ సీఎం స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించటమే తన టార్గెట్ గా నితీష్ చెప్పారు. ఇదే విషయాన్ని కేసీయార్, మమత కూడా చెబుతున్నా అంతర్లీనంగా నాన్ ఎన్డీయే పార్టీల కూటమికి నాయకత్వం వహించాలన్న కోరిక బలంగా వారిలో కనబడుతోంది.
ఇక్కడే ఈ ఇద్దరికీ మిగిలిన పార్టీలతో పాటు యూపీఏకి సమస్యలు వస్తున్నాయి. సమస్య ఏమిటంటే ఇద్దరు కూడా నమ్మదగ్గ నేతలుకారు. ఎప్పుడు ఎలాగుంటారో ? ఎవరితో చేతులు కలుపుతారో కూడా మిగిలిన వాళ్ళు ఊహించలేరు. కేసీయార్, మమత గతచరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ తో తాను చర్చలు జరిపానని మమత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
హేమంత్ యూపీఏలో అధికారిక భాగస్వామి. యూపీఏ భాగస్వామి హోదాలో హేమంత్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకమే. ఇక ఈ సీఎంతో మమత కొత్తగా చర్చించేదేముంటుంది ? అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో నితీష్ బిజీగా ఉన్నారు. అలాంటిది నితీష్ తో మమత కొత్తగా మాట్లాడేదేముంటంది ? ఇక కేసీయార్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కాబట్టి నాన్ ఎన్డీయే పార్టీల బృందానికి నాయకత్వం వహించే విషయంలో కేసీయార్, మమత మధ్య పోటీ మొదలైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on September 10, 2022 2:12 pm
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…