క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. శాఖల మీద పట్టు పెంచుకోవటంతో పాటు రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలామంది మంత్రులు ఫెయిలయ్యారనే భావన జగన్లోనే కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనతో పాటు తన భార్యపైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మంత్రుల్లో చాలామంది స్పందించకపోవటంపై జగన్ ఫుల్లుగా ఫైర్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ కారణంతోనే పనితీరు సరిగాలేని కొందరు మంత్రులను మార్చేస్తానని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారట. మొత్తం ఎపిసోడ్ లో నలుగురు మంత్రుల పనితీరు అస్సలు బావోలేదని జగన్ కు ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. కాబట్టి వచ్చే దసరాలోగా మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలున్నాయనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త కరెక్టయితే మళ్ళీ ఇద్దరు నానీలు మంత్రివర్గంలోకి వస్తారని వైసీపీ నేతలంటున్నారు. వివిధ కారణాలతో కొడాలి నాని, పేర్ని నానీని జగన్ మంత్రివర్గంలో నుంచి తొలగించారు.
వీళ్ళద్దరు కూడా ప్రతిపక్షాలపై చాలా దూకుడుగా విరుచుకుపడేవారే. అయితే మాజీలైన తర్వాత వీళ్ళ దూకుడు తగ్గిపోయింది. మంత్రులుగా ఉన్నవాళ్ళే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, ప్రతిపక్షాలపై ఎదురుదాడులు చేయకపోతే తామెందుకు పూసుకోవాలని అనుకున్నారో ఏమో. అందుకనే మీడియాలో కనబడటం నానీలిద్దరు తగ్గించేశారు. ఇదే విషయం జగన్ కు స్పష్టంగా అర్ధమైందట.
అందుకనే పనితీరు ఆధారంగా ముగ్గురు, నలుగురిని పక్కనపెట్టి కొందరికి శాఖలను మార్చాలని అనుకుంటున్నారు. కొందరిని తప్పిస్తే మరికొందరిని మళ్ళీ తీసుకోవాలి కదా. ఆ ఈక్వేషన్లలోనే మళ్ళీ మంత్రివర్గంలోకి కొడాలి, పేర్ని రాబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఏదో అనుకుని మంత్రివర్గంలో జగన్ మార్పులు చేస్తే అది ఇంకేదో అవుతోందనే భావన అందరిలోను ఉంది. అందుకనే దసరాకు మంత్రివర్గంలో జరగబోయే మార్పుల్లో నానీలకు మంత్రియోగం దక్కబోతోందని సమాచారం.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…