Political News

జ‌గ‌న్ ఆణిముత్య‌మ‌ట‌.. లోకేష్ ప‌ప్పుసుద్ద అట‌!!

ఏపీలో వైసీపీ నేత‌ల భ‌జ‌న ప‌రాకాష్టకు చేరింద‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్‌ను, ఆయ‌న తండ్రి.. మాజీ సీఎం దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఆకాశానికి ఎత్తేయ‌డం.. పార్టీలో ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌దే. అయితే.. ఎవ‌రి పంథాలో వారు.. ఈ భ‌జ‌న విష‌యంలో మ‌రింత దూకుడుగా ఉన్నార నేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. మంత్రి ప‌ద‌వులు కాపాడుకోవాల‌నే కోరికో.. లేక‌.. అధినేతను మ‌చ్చిక చేసుకోక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు రావ‌నే బెంగే తెలియ‌దు కానీ.. నాయ‌కులు పోటీ ప‌డి మ‌రీ.. అధినేత‌ను మెచ్చిక చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా గుంటూరు జిల్లా వేమూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి మేరుగ నాగార్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న‌.. ఇదే స‌మయంలో టీడీపీ నేత‌లు .. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం న‌డుస్తోంద‌ని వ్యాఖ్యానించ‌డంపై ఆయ‌న మండి ప‌డ్డారు. రాజా రెడ్డిని త‌క్కువ చేసి మాట్లాడుతున్నార‌ని.. అన్న మంత్రి.. ఆయ‌న ఈ దేశానికి ఒక అద్భుత‌మైన సేవ చేశారని అన్నారు. దేశానికి ఆణిముత్యాల్లాంటి కుమారుల‌ను ఇచ్చార‌ని.. చెప్పుకొచ్చారు.

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి ఆణిముత్యం లాంటి నాయ‌కుడ‌ని.. చెప్పిన నాగార్జున ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కూడా ఆణిముత్య‌మేన‌ని అన్నారు. అలాంటి రాజారెడ్డిని ఎందుకు ఆడిపోసుకుంటున్నార‌ని ప్ర‌తివిమ‌ర్శలు సంధించారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ఈ దేశానికి, రాష్ట్రానికి ఏమిచ్చార‌ని.. నిల‌దీశారు. ప‌ప్పు సుద్ద వంటి.. లోకేష్‌ను రాష్ట్రంపై రుద్దార‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన నెటిజ‌న్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. రాజారెడ్డిపై.. పులివెందుల పోలీసు స్టేష‌న్లో అనేక కేసులు ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్నారు.

అంతేకాదు.. జ‌గ‌న్ ఆణిముత్య‌మే అయితే.. 32 కేసులు ఎందుకు న‌మోదు చేశారు. సీబీఐ ఎందుకు ఆయ‌న‌ను అరెస్టు చేసింది? ఆయ‌న ఎందుకు 16 మాసాలు జైల్లో ఉన్నారు? అనే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డాన్ని.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆణిముత్యం ఇంకా.. బెయిల్‌పైనే ఉన్న విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం మంత్రి ఇంత హ‌ఠాత్తుగా పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబంపై ఇలా.. ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌డం వెనుక‌.. తాజాగా సీఎం జ‌గ‌న్ ఇచ్చిన క్లాసే ప‌నిచేసి ఉంటుంద‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీలో త‌న కుటుంబంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నా.. మంత్రులుగా ఉన్న వారు ఎందుకు మౌనం వ‌హిస్తున్నార‌ని.. బాగానే క్లాస్ తీసుకున్నారు జ‌గ‌న్‌. బ‌హుశ ఈ ఎఫెక్ట్‌తోనే నాగార్జున ఇలా రియాక్ట్ అయిఉంటార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago