ఏపీలో వైసీపీ నేతల భజన పరాకాష్టకు చేరిందని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ను, ఆయన తండ్రి.. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికి ఎత్తేయడం.. పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే.. ఎవరి పంథాలో వారు.. ఈ భజన విషయంలో మరింత దూకుడుగా ఉన్నార నేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. మంత్రి పదవులు కాపాడుకోవాలనే కోరికో.. లేక.. అధినేతను మచ్చిక చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావనే బెంగే తెలియదు కానీ.. నాయకులు పోటీ పడి మరీ.. అధినేతను మెచ్చిక చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇదే సమయంలో టీడీపీ నేతలు .. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించడంపై ఆయన మండి పడ్డారు. రాజా రెడ్డిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. అన్న మంత్రి.. ఆయన ఈ దేశానికి ఒక అద్భుతమైన సేవ చేశారని అన్నారు. దేశానికి ఆణిముత్యాల్లాంటి కుమారులను ఇచ్చారని.. చెప్పుకొచ్చారు.
దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి ఆణిముత్యం లాంటి నాయకుడని.. చెప్పిన నాగార్జున ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆణిముత్యమేనని అన్నారు. అలాంటి రాజారెడ్డిని ఎందుకు ఆడిపోసుకుంటున్నారని ప్రతివిమర్శలు సంధించారు. అదేసమయంలో చంద్రబాబు ఈ దేశానికి, రాష్ట్రానికి ఏమిచ్చారని.. నిలదీశారు. పప్పు సుద్ద వంటి.. లోకేష్ను రాష్ట్రంపై రుద్దారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. రాజారెడ్డిపై.. పులివెందుల పోలీసు స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు.. జగన్ ఆణిముత్యమే అయితే.. 32 కేసులు ఎందుకు నమోదు చేశారు. సీబీఐ ఎందుకు ఆయనను అరెస్టు చేసింది? ఆయన ఎందుకు 16 మాసాలు జైల్లో ఉన్నారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకపోవడాన్ని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆణిముత్యం ఇంకా.. బెయిల్పైనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం మంత్రి ఇంత హఠాత్తుగా పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబంపై ఇలా.. ప్రశంసల జల్లు కురిపించడం వెనుక.. తాజాగా సీఎం జగన్ ఇచ్చిన క్లాసే పనిచేసి ఉంటుందని అంటున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో తన కుటుంబంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రులుగా ఉన్న వారు ఎందుకు మౌనం వహిస్తున్నారని.. బాగానే క్లాస్ తీసుకున్నారు జగన్. బహుశ ఈ ఎఫెక్ట్తోనే నాగార్జున ఇలా రియాక్ట్ అయిఉంటారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on September 9, 2022 10:44 am
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…