Political News

కేసుల నుంచి జ‌గ‌న్‌కు కొంత రిలీఫ్ వ‌చ్చింది.. కానీ, టెన్ష‌నే

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహరంలో కొంత రిలీఫ్ వ‌చ్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న టెన్ష‌న్‌లో కొంత మేర‌కు త‌గ్గింద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పూర్తిగా టెన్ష‌న్ అయితే పోలేద‌ని చెబుతున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రిగిందనేది ఆస‌క్తిగా మారింది. సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జిషీట్లపైనే తేల్చాలని స్పష్టం చేసింది.

సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ రెండూ సమాంతరంగా విచారణ జరిపినప్పటికీ.. సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించరాదని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే.. ఈడీ కేసులే ఉండవని హైకోర్టు పేర్కొంది. ఇది వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు దారితీసింది.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టును ఈడీ కోరింది. ఇందుకు అంగీకరించిన కోర్టు.. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వేర్వేరుగా పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తాజాగా తీర్పు వెలువరించారు. ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని.. ఒకవేళ సీబీఐ కేసులు కొట్టివేస్తే నేరపూరిత సొమ్ము అంశం ఉండదని హైకోర్టు పేర్కొంటూ.. సీబీఐ కోర్టు తీర్పును కొట్టివేసింది. ఈ ప‌రిణామం.. నిజంగానే సీఎం జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్ అవుతుంద‌నేది వైసీపీ నేత‌ల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 9, 2022 8:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago