ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో టీఆర్ఎస్-కాంగ్రెస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పై బలమైన పోరాటం చేయాలంటే నాన్ ఎన్డీయేపార్టీలు+యూపీయే చేతులు కలపాల్సిన అవసరం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్నటి భేటీలో కేసీయార్ కు చాలా గట్టిగా చెప్పారట. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఎన్డీయే మీద పోరాటం ఎప్పటికీ సక్సెస్ కాదని కూడా నితీష్ స్పష్టంగా చెప్పారట.
నితీష్ చెప్పిన మాటలకు కేసీయార్ సానుకూలంగానే స్పందించారని సమాచారం. అయితే కాంగ్రెస్ తో చేతులు కలపటం ఇప్పటికిప్పుడు సాధ్యంకాదని కూడా చెప్పారట. ఎందుకంటే తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మీద బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. కేసీయార్ ను గద్దెదింపి అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ కూడా పెద్ద ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో చేతులు కలపటం ఇప్పట్లో సాధ్యంకాదని నితీష్ కు కేసీయార్ స్పష్టంచేశారట.
కావాలంటే 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయం ఆలోచిస్తానని చెప్పారట. నరేంద్రమోడీని గద్దె దింపటం తనకు ఎంతముఖ్యమో తెలంగాణాలో అధికారంలోకి రావటమూ అంతే ముఖ్యమని కేసీయార్ తేల్చిచెప్పారట. దాంతో నితీష్ కూడా కేసీయార్ వాదనను కొట్టిపారేయలేకపోయారని టీఆర్ఎస్ నేతలంటున్నారు.
ఇందుకనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ తో టీఆర్ఎస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నాన్ ఎన్డీయే పార్టీల్లో ఐకమత్యం ఎంతగా ఉంటే అంత బలమైన ప్రతిపక్షమం తయారవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నితీష్ ప్రతిపాదనలకు చాలాపార్టీల అధినేతలు సానుకూలంగానే స్పందించారట. కేసీయార్ తో మాట్లాడినట్లే తొందరలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కూడా నితీష్ మాట్లాడబోతున్నారట. మరి దీదీ ఎలాగ స్పందిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on September 8, 2022 2:25 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…