Political News

ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకే పోటీచేస్తారా ?

తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.

ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు ఎలాగున్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే. ఎందుకంటే ఈమధ్యనే కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలతో ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీకి 80 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. గట్టిగా కష్టపడితే మరో పదిసీట్లు అదనంగా రావటం ఖాయమని అంటే మొత్తం 90 సీట్లు వస్తాయని చెప్పారు.

కేసీయార్ చెప్పినదాంట్లో ఎంత నిజముందో సీఎంకే తెలియాలి. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో చూస్తే కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జనాభిప్రాయానికి కేసీయార్ మాటలకు లింకు కుదరటంలేదు. ఇక బీజేపీ విషయం చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే ఊదరగొడుతున్నారు. బండి మాటలమీద కూడా పెద్ద నమ్మకం కలగటంలేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం.

వాస్తవం ఇలాగుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మాదేనంటే ఎలా నమ్ముతారు ? బీజేపీకి అంత సీన్ లేదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రావటం ఖాయమని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పై ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నారట. బహుశా రేవంత్ కొడంగల్ లేదా కల్వకుర్తి, ఉత్తమ్ హుజూర్ నగర్, అప్పటివరకు పార్టీలోనే ఉంటే వెంకటరెడ్డి నల్గొండ నుండి పోటీచేస్తారని అనుకుంటున్నారు.

This post was last modified on September 8, 2022 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

23 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago