Political News

ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకే పోటీచేస్తారా ?

తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.

ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు ఎలాగున్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే. ఎందుకంటే ఈమధ్యనే కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలతో ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీకి 80 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. గట్టిగా కష్టపడితే మరో పదిసీట్లు అదనంగా రావటం ఖాయమని అంటే మొత్తం 90 సీట్లు వస్తాయని చెప్పారు.

కేసీయార్ చెప్పినదాంట్లో ఎంత నిజముందో సీఎంకే తెలియాలి. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో చూస్తే కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జనాభిప్రాయానికి కేసీయార్ మాటలకు లింకు కుదరటంలేదు. ఇక బీజేపీ విషయం చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే ఊదరగొడుతున్నారు. బండి మాటలమీద కూడా పెద్ద నమ్మకం కలగటంలేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం.

వాస్తవం ఇలాగుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మాదేనంటే ఎలా నమ్ముతారు ? బీజేపీకి అంత సీన్ లేదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రావటం ఖాయమని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పై ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నారట. బహుశా రేవంత్ కొడంగల్ లేదా కల్వకుర్తి, ఉత్తమ్ హుజూర్ నగర్, అప్పటివరకు పార్టీలోనే ఉంటే వెంకటరెడ్డి నల్గొండ నుండి పోటీచేస్తారని అనుకుంటున్నారు.

This post was last modified on September 8, 2022 2:23 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

9 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

9 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

3 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

3 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago