Political News

ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకే పోటీచేస్తారా ?

తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.

ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు ఎలాగున్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే. ఎందుకంటే ఈమధ్యనే కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలతో ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీకి 80 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. గట్టిగా కష్టపడితే మరో పదిసీట్లు అదనంగా రావటం ఖాయమని అంటే మొత్తం 90 సీట్లు వస్తాయని చెప్పారు.

కేసీయార్ చెప్పినదాంట్లో ఎంత నిజముందో సీఎంకే తెలియాలి. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో చూస్తే కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జనాభిప్రాయానికి కేసీయార్ మాటలకు లింకు కుదరటంలేదు. ఇక బీజేపీ విషయం చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే ఊదరగొడుతున్నారు. బండి మాటలమీద కూడా పెద్ద నమ్మకం కలగటంలేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం.

వాస్తవం ఇలాగుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మాదేనంటే ఎలా నమ్ముతారు ? బీజేపీకి అంత సీన్ లేదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రావటం ఖాయమని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పై ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నారట. బహుశా రేవంత్ కొడంగల్ లేదా కల్వకుర్తి, ఉత్తమ్ హుజూర్ నగర్, అప్పటివరకు పార్టీలోనే ఉంటే వెంకటరెడ్డి నల్గొండ నుండి పోటీచేస్తారని అనుకుంటున్నారు.

This post was last modified on September 8, 2022 2:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

44 mins ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

2 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

2 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

3 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago