Political News

సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి(సీఆర్డీఏ) కోసం.. ఏకంగా 1600 కోట్ల అప్పు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి కేబినెట్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో రాజ‌ధాని ప‌నులు చేస్తారా? లేదా? అనే విష‌యాన్ని మాత్రం స‌ర్కారు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల ఆమోదానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న సీఎం జగన్‌ చేయూత నిధులను విడుదల చేస్తారు.. వారంపాటు మండల స్థాయిలో మహిళలతో చేయూత వేడుకలు నిర్వహించనున్నారు.

జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం 4 వేల 20 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల రాటిఫికేషన్‌ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలన్న నిర్ణయాన్ని.. మంత్రివర్గం ఆమోదించింది. గ్రేటర్‌ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

యూనివర్సిటీలో అధ్యాపకుల కోసం నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్‌ కచ్చితంగా పాస్‌ కావాలన్న నిబంధనకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయంలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్‌ టీచింగ్ సిబ్బందిని అవుట్ సోర్సింగ్‌పై నియామకానికి నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర సచివాలయంలో 85 మంది అదనపు సిబ్బంది పోస్టుల నియామకానికి ఆంగీకారం తెలిపింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని.. మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం తీసుకునేందుకు.. బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ యాక్ట్‌లోని ‘ఒ’ క్లాజ్‌లో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

This post was last modified on September 8, 2022 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

41 minutes ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

4 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

4 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

4 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

4 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

5 hours ago