మన గొప్పదనాన్ని మనం చెప్పడం కన్నా ఇతరులు చెబితే బాగుంటుంది. మనం నిజంగా ఎంత గొప్ప పని చేసినా.. నేను ఇంత చేశా అంతా చేశా అని చెప్పుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. అదే విషయం వేరే వాళ్ల నోటి నుంచి వస్తే దాని విలువ రెట్టింపవుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య బాగా అన్పాపులర్ అయ్యారు. అంతా నేనే చేశా అని చెప్పుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో ఆయన మరీ హద్దులు దాటిపోతుంటారు.
హైదరాబాద్లో ఒకప్పుడు ఆయన అభివృద్ధికి బాటలు పరిచిన మాట వాస్తవం. దాని వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగిన మాటా నిజమే. కానీ దానికి ముడిపెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా క్రెడిట్ నాదే అని ముందుకు వచ్చేస్తుంటారు చంద్రబాబు. సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి మంచి కంటే చెడే చేస్తాయి. ఇలాంటి వ్యాఖ్యల్ని కామెడీ చేసి బాబును అన్పాపులర్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
ఐతే చంద్రబాబుకున్న ఈ అలవాటును తమకు అనుకూలంగా మలుచుకుని లేని విషయాల్ని కూడా కల్పించి బాబును బద్నాం చేయడం ఎక్కువైపోయింది ఈ మధ్య. తాజాగా ఆయన గురించి మీడియాలో ఒక వార్త కనిపిస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ చేయడానికి తనే కారణం అని చంద్రబాబు అన్నట్లుగా ఉందా వార్త. దీన్ని పట్టుకుని సోషల్ మీడియాలో బాబును కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. కానీ వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు ఆ మాట అననే లేదు.
కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యానికి తాను ఫోన్ చేసి అభినందనలు చెప్పానని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన కృషి వల్లే బయోటెక్నాలజీ రంగంలో ఇంత పురోగతి సాధ్యమైందని, జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వాళ్ళు తనతో చెప్పారని.. అదెంతో సంతృప్తినిచ్చిందని మాత్రమే చంద్రబాబు అన్నారు. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి తనే కారణం అని ఆయన ఎక్కడా అనలేదు. కానీ మీడియాలో మాత్రం ఇలాగే వార్త వచ్చింది. దాన్ని పట్టుకుని చంద్రబాబును కామెడీ చేస్తున్నారు వ్యతిరేకులు.
This post was last modified on July 6, 2020 4:49 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…