గత కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతోన్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు, రైతుల సపోర్ట్ తో జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్…తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టాలంటూ విపక్ష పార్టీల నేతలు చురకలంటిస్తున్నారు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేం కాదని, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి అధికార పార్టీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట గెలిచి రచ్చ గెలవాలి…అన్న సామెత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాస్త లేటుగా అయినా గుర్తొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలలో పైకి జాతీయ పార్టీపై ప్రకటనలు చేస్తున్నా…రాష్ట్ర రాజకీయలపై కూడా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలు, ఫెడరల్ ఫ్రంట్ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి కేసీఆర్ ను తాకనుంది. తెలంగాణ ఇంట జరిగే ఆ ఎన్నికల్లో గెలవకుంటే…జాతీయ స్థాయిలో ఫెడరల్ రచ్చ గెలవలేమని కేసీఆర్ అనుకుంటున్నారట. తెలంగాణలో అధికారం కోల్పోతే దేశ రాజకీయాలలో తనను ఎవరూ పట్టించుకోరన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చారట. అందుకే, ముచ్చటగా మూడో సారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారట.
అయితే, ఈ సారి బీజేపీ మత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగించాలని కేసీఆర్ అనుకుంటున్నారట. తెలంగాణకు బీజేపీ వీసమెత్తు సాయం కూడా చేయలేదని, పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్న యాంగిల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారట. అంతేకాదు, తెలంగాణలో కచ్చితంగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తేనే…2024 సార్వత్రిక ఎన్నికలలో తాడోపేడో తేల్చుకోవచ్చని భావిస్తున్నారట.
This post was last modified on September 7, 2022 7:24 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…