ఏపీ రాజకీయాల్లో టీడీపీ శైలి విభిన్నం. ఏం చేసినా.. ఒక ప్రణాళికప్రకారం.. ఒక నిర్దిష్ట విధానం ప్రకారమే జరుగుతుంది. ఎక్కడా అజాగ్రత్తలకు తావుండదు. అందుకే.. క్రమశిక్షణ ఉన్న పార్టీగా.. ఎప్పటి నుంచో టీడీపీకి పేరుంది. అయితే..రాను రాను ఈ విషయంలో నాయకుల శైలి మారుతోంది. గతంలో సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేసిన నాయకులు.. ఇప్పుడు.. తమ మేలుకోసం పరితపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. “మాకేంటి?” అనే సంస్కృతి పెరిగిపోయింది.
దీంతో నాయకులు ముందుకు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. చంద్రబాబు సహా కీలక నేతలు పిలుపు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా కదలిక కనిపించడం లేదు. దీనికి కారణం.. కొన్ని విషయాల్లో నాయకులు క్లారిటీ కోరుతుండడమే. ముఖ్యంగా ఈ జాబితాలో నాయకులు మూడు విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి… వచ్చే ఎన్నికల్లో పొత్తులు. టీడీపీ అయితే.. పొత్తులతో ముందుకు సాగుతాననే సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ పొత్తులు ఏ పార్టీతో ఉంటాయి? ఎలా ఉంటాయి? అనేది.. నేతల మధ్య చర్చకు వస్తోంది. ఎందుకంటే.. పొత్తులు కన్ఫర్మ్ అయ్యేవరకు కూడా తమకు సీటు దక్కుతుందో లేదో.. అనే బెంగ వారిని వెంటాడుతోంది. ఇప్పుడు కాలికి బలపం కట్టుకని తిరిగి.. తీరా ఎన్నికల వేళకు వేరేవారికి టికెట్ ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని.. నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ కోరుతున్నారు.
రెండు.. ఎన్నికల హామీలు. ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు.. పేదలకు.. నెల నెలా డబ్బులు పంచుతున్నాయి. దీంతో పేదల దృష్టి వైసీపీపైనే ఉందనేది టీడీపీ నాయకుల ప్రగాఢ విశ్వాసం. దీంతో పేదలను.. మన వైపు తిప్పుకోవాలంటే.. మనం కూడా అంతే బలమైన వాగ్దాలను ప్రజలకు ఇవ్వాలనేది వారి మాట. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏంటనేది వారి ప్రశ్న. దీనిపైనా వారు క్లారిటీ కోరుతున్నారు.
మూడు.. యువ నాయకులకు టికెట్లు అంటున్నారే తప్ప.. ఎవరికి ఇస్తారు? అనేది మాత్రం చెప్పడం లేదు. దీంతో ఇక్కడ కూడా సందిగ్ధావస్తే కొనసాగుతోంది. యువ తరం అంటే.. ఇప్పటికే ఉన్న సీనియర్ల కుటుంబాల నుంచి వచ్చిన యువతా? లేక.. కొత్తగా పార్టీకి అండగా ఉంటున్న యువతా? అనేది ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలు టీడీపీలో కొన్నాళ్లుగా చర్చకు వస్తున్నాయి.
అయితే.. వీటిపై చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. ఇవి.. రాజకీయంగా ప్రభావం చూపే అంశాలు కావడంతో ఆయన ముందు.. మీరు క్షేత్రస్తాయిలో పనులు ప్రారంభించండని చెబుతున్నారే తప్ప.. ఎక్కడా క్లూ ఇవ్వడం లేదు. దీంతో నాయకులు కూడా తమ పంథా వీడడం లేదు. మరి ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…