Political News

టీఆర్ఎస్ సన్నిహితులే టార్గెట్టా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం టీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. లిక్కర్ స్కాం తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఉన్నతాధికారులు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ లోనే ఆరు చోట్ల దాడులు చేయడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ దాడులు కూడా టీఆర్ఎస్ కు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళ ఇళ్ళల్లోనే జరిగాయనే ప్రచారం పెరిగిపోతోంది.

సూదిని సృజన్ రెడ్డి, బోయినపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమసాగర్ రావుల ఇళ్ళు, ఆఫీసులపైన ఈడీ దాడులు చేసింది. వీళ్ళంతా టీఆర్ఎస్ లోని కీలక వ్యక్తులకు అత్యంత సన్నిహితులనే ప్రచారముంది. లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఎంపీల ఆరోపణలను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు అభిషేక్ రావు బాగా సన్నిహితుడట. అందుకని స్కామ్ లో కవిత పాత్రపై నిగ్గు తేల్చటానికే అభిషేక్ రావుపై ఈడీ దాడులు చేసిందని పార్టీలో కూడా చెప్పుకుంటున్నారు.

ఏదేమైనా ముందు బీజేపీ ఎంపీలు కవితపై ఆరోపణలు చేయటం తర్వాత ఈడీ ఉన్నతాధికారులు టీఆర్ఎస్ లేదా కవితకు సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వాళ్ళ ఆఫీసులు, ఇళ్ళపై దాడులు జరగటం చూస్తుంటే ఏదో అనుమానాలుగానే ఉన్నాయి. ఊరికే ఈడీ అధికారులు ఎవరిపైనా దాడులు చేయరు. ఎవరితోనో ఎక్కడో లింకులుంటేనే దాడులు చేస్తారు. తమకు దొరికిన బీరకాయ పీచు లింకులను పట్టుకుని ఇక దాన్ని పీకిపీకి పాకనపెడతారు.

మొత్తానికి తాజా ఈడీ దాడులు టీఆర్ఎస్ లో మాత్రం కలకలం రేపుతున్నాయి. ఏరోజు ఏమవుతుందో ? ఎవరిపైన దాడులు జరుగుతాయో అర్థం కాక చాలామంది నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దాడులను ఆపలేరు అలాగని దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేని పరిస్ధితిలో పడిపోయారు గులాబీపార్టీ నేతలు. మొత్తానికి టీఆర్ఎస్ సన్నిహితులే టార్గెట్ గా ఈడీ దాడులు జరుగుతున్నాయన్న విషయంలో క్లారిటి వచ్చేసింది.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

36 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago