గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభం కుటుంబం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిబాబు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కాపులను బీసీల్లో చేరుస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలన్న డిమాండుతో ముద్రగడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చేసిన ఆందోళనలను కాపు సామాజికవర్గం తరపున చేశారే కానీ ఏ పార్టీ తరపునో చేయలేదు. కాపుల్లో ముద్రగడ తిరుగులేని పట్టుందని చెప్పేందుకు లేదుకానీ మంచి ఇమేజి ఉందని మాత్రం చెప్పచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడకు కాపు సామాజికవర్గంతో పాటు కాపు సంఘాల్లో మంచి సంబంధాలున్నాయి.
ఈయన్ను జనసేనలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరిగినా ఎందుకనో సక్సెస్ కాలేదు. అలాగే బీజేపీలో చేరాలని ముద్రగడపై కొందరు ఒత్తిళ్ళు తెచ్చినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. అయితే తాజా పరిణామాల్లో ఆయన కొడుకు గిరిబాబు వైసీపీలో చేరటానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కొడుకు వైసీపీలో చేరటమంటే అందుకు పద్మనాభం ఆమోదం లేకుండా జరగదని అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో ఎక్కడినుండో గిరిబాబుకు టికెట్ ఖాయంగా ఇచ్చేట్లుంటేనే గిరిబాబును పార్టీలో చేర్చుకుంటారు. పోటీ చేయించే ఉద్దేశ్యం లేనపుడు ఆయన్ను వైసీపీలో చేర్చుకోవటం దండగే.
అయితే వచ్చే ఎన్నికల్లో లబ్దికోసమని అవకాశం రాగానే ఎంఎల్సీ స్ధానాన్ని కేటాయించే అవకాశం కూడా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించే పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. అందుకనే అన్నీపార్టీలు ప్రత్యేకించి గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాయి. ముద్రగడ కుటుంబం గనుక వైసీపీలో చేరితే రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుకోవాలి.
This post was last modified on September 5, 2022 3:36 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…