Political News

వైసీపీలోకి ముద్రగడ కుటుంబం ?

గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభం కుటుంబం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిబాబు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

కాపులను బీసీల్లో చేరుస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలన్న డిమాండుతో ముద్రగడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చేసిన ఆందోళనలను కాపు సామాజికవర్గం తరపున చేశారే కానీ ఏ పార్టీ తరపునో చేయలేదు. కాపుల్లో ముద్రగడ తిరుగులేని పట్టుందని చెప్పేందుకు లేదుకానీ మంచి ఇమేజి ఉందని మాత్రం చెప్పచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడకు కాపు సామాజికవర్గంతో పాటు కాపు సంఘాల్లో మంచి సంబంధాలున్నాయి.

ఈయన్ను జనసేనలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరిగినా ఎందుకనో సక్సెస్ కాలేదు. అలాగే బీజేపీలో చేరాలని ముద్రగడపై కొందరు ఒత్తిళ్ళు తెచ్చినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. అయితే తాజా పరిణామాల్లో ఆయన కొడుకు గిరిబాబు వైసీపీలో చేరటానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కొడుకు వైసీపీలో చేరటమంటే అందుకు పద్మనాభం ఆమోదం లేకుండా జరగదని అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో ఎక్కడినుండో గిరిబాబుకు టికెట్ ఖాయంగా ఇచ్చేట్లుంటేనే గిరిబాబును పార్టీలో చేర్చుకుంటారు. పోటీ చేయించే ఉద్దేశ్యం లేనపుడు ఆయన్ను వైసీపీలో చేర్చుకోవటం దండగే.

అయితే వచ్చే ఎన్నికల్లో లబ్దికోసమని అవకాశం రాగానే ఎంఎల్సీ స్ధానాన్ని కేటాయించే అవకాశం కూడా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించే పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. అందుకనే అన్నీపార్టీలు ప్రత్యేకించి గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాయి. ముద్రగడ కుటుంబం గనుక వైసీపీలో చేరితే రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుకోవాలి.

This post was last modified on September 5, 2022 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

3 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

47 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago