తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. విజయం తమదేనని చెప్పుకోవడం వరకే కాంగ్రెస్ నేతలు పరి మితమవుతున్నారా? భారం మొత్తం పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్పై వేసి.. తాము చోద్యం చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఉగాది పచ్చడిని తలపిస్తోందని చెబుతున్నారు. కేవలం 10 జిల్లాల్లో మాత్రమే.. పార్టీ పరిస్థితి బాగుందని.. ఆయా జిల్లాల్లో ఆశాజనమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. బలమైన నాయకులు చాలా మంది టీఆర్ఎస్లోకి చేరిపోయారు. దీంతో ఆయా జిల్లాల్లో వారి హవానే కనిపిస్తోంది. ఒకప్పుడు.. రంగారెడ్డి జిల్లా అంటే.. కాంగ్రెస్కు పెట్టని కోట. అదేవిధంగా ఖమ్మం కూడా. ఇలా.. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే.. టీఆర్ఎస్ దూకుడుతో ఆయా జిల్లాల్లో నాయకులు జంప్ చేశారు.
ఫలితంగా కాంగ్రెస్ జెండా మోసే నాయకులు కనిపించడం లేదు. నాయకులు ఉన్నా.. సఖ్యతలేక నానా తిప్పులు పడుతోంది. ప్రస్తుతం 25 కు పైగా జిల్లాల్లో పార్టీ కేడర్ ఉన్నా.. నడిపించే నాయకులు లేక సతమ తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా.. ప్రత్యర్థి పార్టీ బీజేపీ నుంచి కూడా.. చాలా మంది కాంగ్రెస్ నాయకులకు చాపకింద నీరులా ఆహ్వానాలు అందుతున్నాయి. వచ్చేయండి.. మేం చూసుకుంటాం! అని కీలక నేతల నుంచి భరోసా వస్తోంది.
ఈ పరిణామాలను ముందుగానే గుర్తించి అలెర్ట్ కావడంలో.. కాంగ్రెస్ విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని నడిపించే భారం మొత్తం రేవంత్పై వేసేయడం.. ఆయనే చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేయ డం.. మనం పనిచేసినా.. గుర్తింపు వస్తుందా? అనే సందేహాల మధ్య కాలక్షేపం చేయడం.. వంటివి పార్టీని జారుడుబండపై నిలబెడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి ఆయా జిల్లాల్లో పార్టీ పుంజుకోకపోతే.. అధికారం దక్కడం సాధ్యమేనా.. అనేది సీనియర్లు ఆలోచించుకోవాలని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 5, 2022 11:04 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…