క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలనేది కీలకమైనది. దీనికే జాతీయ సమైక్యతా దినోత్సవమని ముద్దుగా పేరుపెట్టారు. విమోచన దినోత్సవం అనేది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుండి వినబడుతున్నదే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన ఉద్యమంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపటం లేదని స్వయంగా కేసీఆర్ వందలసార్లు డిమాండ్ చేసుంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేసీయార్ ఎన్నో సార్లు ప్రకటించారు. మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఎనిమిదన్నరేళ్ళు అవుతున్నా అప్పటి డిమాండ్ ఏది ? అప్పటి హామీ ఏది ?
అధికారంలోకి రాగానే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని కన్వీనియంట్ గా పక్కనపడేశారు. మిత్రపక్షం ఎంఐఎం అభ్యంతరాల కారణంగా విమోచనదినోత్సవాన్ని జరపకూడదని కేసీఆర్ అనుకున్నారు మానేశారంతే. ఇపుడు హఠాత్తుగా విమోచన దినోత్సవాన్ని మూడురోజులు ఘనంగా ఎందుకు జరపాలని అనుకుంటున్నట్లు? ఎందుకంటే బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకే. విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపకపోతే కేంద్ర హోంశాఖే అధికారికంగా జరుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీది నూరుశాతం ఎన్నికల స్టంటని తెలుస్తునే ఉంది. నిజానికి తెలంగాణా విమోచన దినోత్సవం జరిపినా జరపకపోయినా ఒకటే.
జనాలకు కావాల్సింది మంచి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఇవి లేకుండా ఎన్ని విమోచన దినోత్సవాలు జరిపినా ఉపయోగం ఏముంటుంది? అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నానా గోల చేస్తోంది. కేంద్ర హోంశాఖ నిజంగానే విమోచన దినోత్సవం జరిపితే కేసీయార్ కు అవమానమనే చెప్పాలి. ఎందుకంటే చూస్తు కూర్చోలేరు అలాగని అడ్డుకోనూ లేరు. అందుకనే క్రెడిట్ బీజేపీకి ఎందుకివ్వాలని అనుకున్నట్లున్నారు. వెంటనే తెలంగాణా విమోచన దినోత్సవం అంటు ప్రకటించేశారు.
This post was last modified on September 4, 2022 11:44 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…