క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలనేది కీలకమైనది. దీనికే జాతీయ సమైక్యతా దినోత్సవమని ముద్దుగా పేరుపెట్టారు. విమోచన దినోత్సవం అనేది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుండి వినబడుతున్నదే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన ఉద్యమంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపటం లేదని స్వయంగా కేసీఆర్ వందలసార్లు డిమాండ్ చేసుంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేసీయార్ ఎన్నో సార్లు ప్రకటించారు. మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఎనిమిదన్నరేళ్ళు అవుతున్నా అప్పటి డిమాండ్ ఏది ? అప్పటి హామీ ఏది ?
అధికారంలోకి రాగానే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని కన్వీనియంట్ గా పక్కనపడేశారు. మిత్రపక్షం ఎంఐఎం అభ్యంతరాల కారణంగా విమోచనదినోత్సవాన్ని జరపకూడదని కేసీఆర్ అనుకున్నారు మానేశారంతే. ఇపుడు హఠాత్తుగా విమోచన దినోత్సవాన్ని మూడురోజులు ఘనంగా ఎందుకు జరపాలని అనుకుంటున్నట్లు? ఎందుకంటే బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకే. విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపకపోతే కేంద్ర హోంశాఖే అధికారికంగా జరుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీది నూరుశాతం ఎన్నికల స్టంటని తెలుస్తునే ఉంది. నిజానికి తెలంగాణా విమోచన దినోత్సవం జరిపినా జరపకపోయినా ఒకటే.
జనాలకు కావాల్సింది మంచి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఇవి లేకుండా ఎన్ని విమోచన దినోత్సవాలు జరిపినా ఉపయోగం ఏముంటుంది? అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నానా గోల చేస్తోంది. కేంద్ర హోంశాఖ నిజంగానే విమోచన దినోత్సవం జరిపితే కేసీయార్ కు అవమానమనే చెప్పాలి. ఎందుకంటే చూస్తు కూర్చోలేరు అలాగని అడ్డుకోనూ లేరు. అందుకనే క్రెడిట్ బీజేపీకి ఎందుకివ్వాలని అనుకున్నట్లున్నారు. వెంటనే తెలంగాణా విమోచన దినోత్సవం అంటు ప్రకటించేశారు.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…