Political News

అన్నం పెడుతున్నా ఈ ఆంక్షలేంది జగన్?

నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షం మధ్య నిత్యం ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో హైటెన్షన్ చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ తరఫున అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు వీలుగా మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయగా.. అధికార వైసీపీ కార్యకర్తలు పలువురు అన్న క్యాంటీన్ మీద దాడి చేయటం.. ఆ సందర్భంలో చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే.

తాజాగా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద శనివారం ఇలాంటి రచ్చే చోటు చేసుకుంది. ఈ క్యాంటీన్ ను తీసేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం.. అన్న క్యాంటీన్ ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే అన్న క్యాంటీన్ ను మూయాలని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు తక్కువ ధరకు అన్నం పెడుతున్నా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడుతున్నారు. శనివారం అన్న క్యాంటీన్ వద్ద పంపిణీ చేస్తున్న భోజనాల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూరల పాత్రల్ని అడ్డుకున్నా.. వెనక్కి తగ్గకుండా పేదలకు అన్నం పెట్టారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో గత నెల 12న అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయటం.. దీన్ని మూసేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేయటంపై వివాదం నడుస్తోంది.

ఈ రోజున క్యాంటీన్ కు ఆహారం తెచ్చే వాహనాల్ని మధ్యలో ఆపేశారు. వాహనంలోని కూర పాత్రల్ని పోలీసులు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు కూరలు లేకుండానే ఆహారాన్ని టీడీపీ నేతలు పంపిణీ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు పలువురు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారింది.

ఏం చేసినా తాము భోజనం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు తేల్చి చెప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్కడున్న షాపుల్ని బలవంతంగా పోలీసులు మూయించారు. చిరు వ్యాపారుల మీదా ఆంక్షలు విధించారు. మార్కెట్ కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నేతలు.. కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. అన్నం పెట్టడం కూడా తప్పన్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉందన్న విమర్శలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు అన్న క్యాంటీన్ కు పోటీగా వైసీపీ నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం వైసీపీ వారి క్యాంటీన్ కు సంబంధించిన టెంట్ ను అధికారులు తొలగించారు.

This post was last modified on September 3, 2022 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago