Political News

అన్నం పెడుతున్నా ఈ ఆంక్షలేంది జగన్?

నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షం మధ్య నిత్యం ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో హైటెన్షన్ చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ తరఫున అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు వీలుగా మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయగా.. అధికార వైసీపీ కార్యకర్తలు పలువురు అన్న క్యాంటీన్ మీద దాడి చేయటం.. ఆ సందర్భంలో చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే.

తాజాగా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద శనివారం ఇలాంటి రచ్చే చోటు చేసుకుంది. ఈ క్యాంటీన్ ను తీసేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం.. అన్న క్యాంటీన్ ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే అన్న క్యాంటీన్ ను మూయాలని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు తక్కువ ధరకు అన్నం పెడుతున్నా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడుతున్నారు. శనివారం అన్న క్యాంటీన్ వద్ద పంపిణీ చేస్తున్న భోజనాల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూరల పాత్రల్ని అడ్డుకున్నా.. వెనక్కి తగ్గకుండా పేదలకు అన్నం పెట్టారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో గత నెల 12న అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయటం.. దీన్ని మూసేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేయటంపై వివాదం నడుస్తోంది.

ఈ రోజున క్యాంటీన్ కు ఆహారం తెచ్చే వాహనాల్ని మధ్యలో ఆపేశారు. వాహనంలోని కూర పాత్రల్ని పోలీసులు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు కూరలు లేకుండానే ఆహారాన్ని టీడీపీ నేతలు పంపిణీ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు పలువురు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారింది.

ఏం చేసినా తాము భోజనం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు తేల్చి చెప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్కడున్న షాపుల్ని బలవంతంగా పోలీసులు మూయించారు. చిరు వ్యాపారుల మీదా ఆంక్షలు విధించారు. మార్కెట్ కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నేతలు.. కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. అన్నం పెట్టడం కూడా తప్పన్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉందన్న విమర్శలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు అన్న క్యాంటీన్ కు పోటీగా వైసీపీ నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం వైసీపీ వారి క్యాంటీన్ కు సంబంధించిన టెంట్ ను అధికారులు తొలగించారు.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

32 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago