Political News

బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దు వెనుక రాజకీయం?

బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దవటం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ ఎన్టీయార్ కావటంతో జనాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ ను పోలీసులు చివరి నిముషంలో రద్దుచేశారు. ముందుగానే ఫంక్షన్ కు సినిమా యూనిట్ అనుమతి తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఫంక్షన్ కు గురువారం రాత్రి పోలీసులు అనుమతిని రద్దుచేశారు.

సినిమా ఫంక్షన్ కు అనుమతులు ఇవ్వడం మళ్ళీ రద్దు చేయడం మామూలుగా జరిగేదే. కానీ ఇక్కడ రద్దయిన ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ కావటంతోనే వివాదం పెద్దదయిపోయింది. సినిమా ఫంక్షన్ను కూడా కేసీయార్ ప్రభుత్వం రాజకీయంగా చూస్తున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీళ్ళ భేటీకి ముందు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ ఇంటికి వెళ్ళొచ్చారు.

అంటే అమిత్ ఇటు రామోజీ అటు జూనియర్ తో ఒకేరోజు భేటీ అవ్వటం రాజకీయంగా బాగా హీటెక్కించింది. ఈ రెండు భేటీలు కచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండటం కోసమే జరిగిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ను బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయమని అమిత్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ సమాధానం ఏమిటనేది తెలీకపోయినా రాజకీయంగా మంటలు మాత్రం పెరిగిపోతున్నాయి.

ఇపుడు జూనియర్ ఫంక్షన్ను కేసీయార్ ప్రభుత్వం నూరుశాతం రాజకీయంగా చూస్తున్నది కాబట్టే సినిమా ఫంక్షన్ కు అనుమతిచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం మళ్ళీ క్యాన్సిల్ చేసిందనే ఆరోపణలు, ప్రచారం పెరిగిపోతోంది. పోలీసులు ముందు అనుమతి ఎందుకు ఇచ్చారో చివరినిముషంలో ఎందుకు రద్దుచేశారో వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ రద్దవటం మాత్రం రాజకీయంగా మంటలు రేపుతోంది.

This post was last modified on September 3, 2022 1:05 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

6 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

7 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

10 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

13 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

14 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

15 hours ago