ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎన్నికల హామీల్లో మద్య నిషేధం ఒకటి. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యమే దొరక్కుండా చేస్తామని ఘనంగా ప్రకటనలు చేశాడు జగన్. కానీ వాస్తవంలో జరిగింది వేరు. మునుపటి కంటే మద్యం అమ్మకాలు పెరిగాయి, కొత్తగా దుకాణాలు వెలిశాయి. ప్రభుత్వం ప్రధానంగా మద్యం ఆదాయం మీదే ఆధారపడుతోంది. ఈ ఆదాయం మీద భారీగా అప్పులు కూడా తెచ్చుకుంటోంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కారు మీద సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి టైంలోనే ఛత్తీస్ గడ్ మంత్రి ఒకరు మద్యపానం గురించి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. వాటిని ఆంధ్రప్రదేశ్కు ముడిపెట్టి కౌంటర్లు వేస్తున్నారు మన నెటిజన్లు. మద్యపాన నియంత్రణ మీద ఛత్తీస్గడ్లో విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన మధుశాల పుస్తకంలోని కవితలను ఉటంకిస్తూ.. దేవాలయాలు, మసీదులు అల్లర్లకు కారణమైతే, మద్యం మాత్రం జనాలను ఒక్కటి చేస్తుందని వ్యాఖ్యానించారు. కాకపోతే మద్యం సేవించే వారిలో వ్యక్తిగత నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతే కాక మనం కూడా పండుగలు, ఎన్నికలప్పుడు మద్యం తాగుతాం కదా అని కూడా ప్రేమ్ సాయి వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్యపానం నియంత్రణ గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో మాట్లాడుతూ.. మద్యం గురించి సానుకూల వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రేమ్ సాయిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆయన అంతటితో ఆగకుండా రోడ్ల మ రమ్మతలులు చేపట్టకపోవడం సమర్థించుకోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చాలామంది రోడ్లు రిపేర్ చేయడం లేదేంటని తనకు ఫోన్లు చేస్తుంటారని.. కానీ రోడ్లు అలా ఉండడం వల్లే ప్రమాదాలు జరగట్లేదని ప్రేమ్ సాయి వ్యాఖ్యానించారు. మద్యం గురించి, రోడ్ల గురించి ప్రేమ్ సాయి చేసిన వ్యాఖ్యలు విని అవాక్కయిన తెలుగు నెటిజన్లు ఈ మాటలు కానీ జగన్ చెవిన పడితే.. ప్రేమ్ సాయిని అమరావతికి రప్పించి సన్మానం చేసినా చేస్తాడని కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on September 2, 2022 4:31 pm
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…