తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు, వాటి నేతలు ప్రాధాన్యం కోల్పోయి చాలా కాలం అయింది. ఆ పార్టీలు, వాటి నేతలు నామమాత్రంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఐతే సీపీఐ నేత నారాయణ రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేకపోయినా సరే.. తన నోటి దురుసుతో తరచుగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయ పార్టీలు, నేతల విషయంలో ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోతూ వచ్చింది కానీ.. ఇటీవల అకారణంగా మెగాస్టార్ చిరంజీవిని దూషించడంతో విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నాడాయన.
చాలా ఏళ్ల కిందటే రాజకీయాలు వదిలేసి, సినిమాలకు పునరంకితమై, వివాదాలకు దూరంగా ఉంటూ మర్యాదరామన్న పాత్ర పోషిస్తున్న చిరును ఉద్దేశించి ‘చిల్లర బేరగాడు’ అనే మాట వాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు నారాయణ. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని.. చిరును ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. నారాయణ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, చిరు అభిమానులతో పాటు కాపు సంఘాల నేతలు, జనసేన మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో నారాయణకు దిక్కు తోచలేదు.
దీంతో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి లెంపలు వేసుకున్నారాయన. ఈ సందర్భంగా నారాయణ చేతులెత్తి నమస్కరించిన తీరు చూస్తే చిరు అభిమానుల దెబ్బ మామూలుగా లేదని అర్థమైంది. ఆ తర్వాత అయినా నారాయణ ఇలాంటి విమర్శలు తగ్గించుకుంటారేమో అనుకుంటే.. అలా ఏమీ చేయలేదు. ఈసారి ఆయన మరో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేశారు. ఇటీవల హోం మంత్రి అమిత్ షా పిలుపు అందుకుని ఆయన్ని ఎన్టీఆర్ కలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ గుజరాత్ ప్రధానిగా ఉన్న సమయంలో అమిత్ షా పెద్ద స్మగ్లర్ అని.. అలాంటి వ్యక్తి పిలిస్తే ఒక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ వెళ్లి కలవాల్సిన అవసరం ఏంటని నారాయణ ప్రశ్నించారు. ఐతే చిరును దూషించినట్లు తారక్ను నారాయణ దూషించనప్పటికీ.. అతణ్ని తప్పుబట్టడం అభిమానులకు రుచించట్లేదు. దేశ ప్రధాని తర్వాత అత్యంత పవర్ ఫుల్ లీడర్ అయిన అమిత్ షా ఆహ్వానిస్తే తారక్ వెళ్లి కలవడం అతడిక ప్లస్సే తప్ప మైనస్ ఏమీ కాదు. దీనిపై నారాయణ విమర్శలు చేయడమేంటంటూ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.
This post was last modified on September 2, 2022 8:40 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…