వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు.
అది కూడా తమ పార్టీకి చెందిన నేతల అంశంపై. వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను మొదటిసారి కలిసింది సెర్బియాలో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్ను విడిపించమని కోరేందుకు. ఆ తర్వాత ఇటీవల రెండోసారి కలిశారు. ఇప్పుడు తమ పార్టీ నుండి గెలిచి.. వ్యతిరేక గళం విప్పుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోమని కోరేందుకు.
ఇటీవల రఘురామ కృష్ణంరాజు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకంపై గళమెత్తారు. రాజధానిగా అమరావతి ఉండాలని, భిన్నగళం వినిపిస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైసీపీ ఆయనపై వేటు వేద్దామనుకున్నప్పటికీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తూ.. వారికి రఘురామ అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారు రెండు రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.
This post was last modified on July 5, 2020 10:46 pm
కాదేది కాపీకనర్హం అన్నట్టు సినిమాలకిచ్చే సంగీతంలోనూ ఈ పోకడ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ పాటలను వాడుకోవడం, మత్తు వదలరాలో…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల…
ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో…
బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.…
మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి…
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…