Political News

వైసీపీ ఎంపీలు కేంద్రం పెద్దలను కలిసింది రెండేసార్లు.. ఎందుకంటే

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు.

అది కూడా తమ పార్టీకి చెందిన నేతల అంశంపై. వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను మొదటిసారి కలిసింది సెర్బియాలో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించమని కోరేందుకు. ఆ తర్వాత ఇటీవల రెండోసారి కలిశారు. ఇప్పుడు తమ పార్టీ నుండి గెలిచి.. వ్యతిరేక గళం విప్పుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోమని కోరేందుకు.

ఇటీవల రఘురామ కృష్ణంరాజు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకంపై గళమెత్తారు. రాజధానిగా అమరావతి ఉండాలని, భిన్నగళం వినిపిస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైసీపీ ఆయనపై వేటు వేద్దామనుకున్నప్పటికీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తూ.. వారికి రఘురామ అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారు రెండు రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.

This post was last modified on July 5, 2020 10:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPYSRCP MPS

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

9 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago