Political News

కేసీఆర్ నినాదం సాధ్యమేనా?

బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి అన్నది కేసీఆర్ తాజా నినాదం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన సందర్భంగా మీడియా సమావేశంలో కేసీఆర్ పై నినాదాన్ని ప్రకటించారు. ఒకపుడు బీజేపీ ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని కాస్త తిప్పి బీజేపీకి వ్యతిరేక నినాదాన్ని చేశారు. అప్పట్లో తాను ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ దాదాపు సాధ్యం చేసి చూపించింది.

దేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తప్ప ఇంకెక్కడా అధికారంలో లేదు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ బలం 54 సీట్ల కనీస స్థాయికి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఏమవుతుందో ఎవరు చెప్పలేరు కానీ ఇప్పటికైతే బీజేపీ నినాదం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మరి ఇదే సమయంలో బీజేపీ బాహుబలి స్థాయిలో రాష్ట్రాల్లో అయినా పార్లమెంటులో అయినా అమితబలంగా కనబడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఎలా సక్సెస్ అవుతుంది ? దేశంలో నరేంద్ర మోదీ పాలనపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ఆ వ్యతిరేకతను అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రతిపక్షాలు లేవు. నాన్ ఎన్డీయే పక్షాల్లో ఎన్నో గొడవలున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించదు. మమత నాయకత్వాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవటం లేదు. అలాగే తానే ప్రధానమంత్రి అభ్యర్థి అవ్వాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బలంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ అంగీకరించటం లేదు.

ఇదే సమయంలో కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని కేసీఆర్ ఇష్టపడటంలేదు. జాతీయ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో ఎన్డీయేని ఢీకొనటం సాధ్యం కాదన్న విషయాన్ని కేసీఆర్, మమత ఒప్పుకోవటం లేదు. ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని జనాలు ఆమోదించటం లేదు. ఇన్ని గొడవల మధ్య బీజేపీ ముక్త్ భారత్ అని కేసీఆర్ నినాదం ఇవ్వగానే జనాలు మోడీకి వ్యతిరేకంగా ఓట్లేసేస్తారా?

This post was last modified on September 2, 2022 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

15 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

52 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago