బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి అన్నది కేసీఆర్ తాజా నినాదం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన సందర్భంగా మీడియా సమావేశంలో కేసీఆర్ పై నినాదాన్ని ప్రకటించారు. ఒకపుడు బీజేపీ ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని కాస్త తిప్పి బీజేపీకి వ్యతిరేక నినాదాన్ని చేశారు. అప్పట్లో తాను ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ దాదాపు సాధ్యం చేసి చూపించింది.
దేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తప్ప ఇంకెక్కడా అధికారంలో లేదు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ బలం 54 సీట్ల కనీస స్థాయికి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఏమవుతుందో ఎవరు చెప్పలేరు కానీ ఇప్పటికైతే బీజేపీ నినాదం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మరి ఇదే సమయంలో బీజేపీ బాహుబలి స్థాయిలో రాష్ట్రాల్లో అయినా పార్లమెంటులో అయినా అమితబలంగా కనబడుతోంది.
ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఎలా సక్సెస్ అవుతుంది ? దేశంలో నరేంద్ర మోదీ పాలనపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ఆ వ్యతిరేకతను అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రతిపక్షాలు లేవు. నాన్ ఎన్డీయే పక్షాల్లో ఎన్నో గొడవలున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించదు. మమత నాయకత్వాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవటం లేదు. అలాగే తానే ప్రధానమంత్రి అభ్యర్థి అవ్వాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బలంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ అంగీకరించటం లేదు.
ఇదే సమయంలో కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని కేసీఆర్ ఇష్టపడటంలేదు. జాతీయ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో ఎన్డీయేని ఢీకొనటం సాధ్యం కాదన్న విషయాన్ని కేసీఆర్, మమత ఒప్పుకోవటం లేదు. ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని జనాలు ఆమోదించటం లేదు. ఇన్ని గొడవల మధ్య బీజేపీ ముక్త్ భారత్ అని కేసీఆర్ నినాదం ఇవ్వగానే జనాలు మోడీకి వ్యతిరేకంగా ఓట్లేసేస్తారా?
This post was last modified on September 2, 2022 8:08 am
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…