Political News

మునుగోడులో పొలిటిక‌ల్ గ‌ణ‌నాథులు

ఎంతైనా.. మ‌న నాయ‌కులు.. నాయ‌కులే! ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. త‌మ‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్నీ వారు వ‌దులుకునే ప‌నేలేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఉప ఎన్నిక‌కురెడీ అవుతున్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న వినాయ‌చ‌వితిని ఇక్క‌డ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. యువ‌త‌ను స‌మీక‌రించ‌డం నుంచి నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో పందిళ్లు వేయ‌డం వ‌ర‌కు.. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ దాకా అంతా కూడా పొలిటిక‌ల్ మ‌యం అయిపోవ‌డం గ‌మ‌నార్హం.

వారు వీరు అనే తేడా లేకుండా.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు మునుగోడులో చ‌వితి వేడుకల‌ను రాజ‌కీయం చేయ‌డం గ‌మ‌నార్హం.  గణేశ్‌ ఉత్సవాలు ప్రత్యేకించి యువత ఆధ్వర్యంలోనే ఎక్కువగా నిర్వహిస్తుండడంతో.. ఉప ఎన్నిక దృష్ట్యా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీలకు.. విగ్రహం కొనుగోలుకు అయ్యే మొత్తంతోపాటు నవరాత్రులు ముగిసేంత వరకు మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చునూ అధికార టీఆర్‌ఎస్‌ నేత ఒకరు అందజేస్తున్నారు.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సైతం ఆయా మండపాల నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలో 150 వినాయక విగ్రహాల ఏర్పాటుకుగాను ఒక్కో కమిటీకి రూ.10 వేల చొప్పున టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ జరిగినట్లు తెలిసింది.  చౌటుప్పల్‌ మార్కెట్‌ యార్డులో వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. దీంతోపాటు చౌటుప్పల్‌ మండలంలోని గ్రామాల్లోనూ 300 విగ్రహాలు, ఉత్సవాల నిర్వహణకు సైతం రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది.

మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్‌, మునుగోడు, నారాయణపురం మండలాల్లో టీఆర్ ఎస్‌తో  పాటు బీజేపీ, కాంగ్రెస్‌ కూడా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా మునుగోడు మండలంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈయన కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా తమను కలిసిన గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పండ‌గ మీది.. ఖ‌ర్చు మాది.. అని నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. వినాయ‌చ‌వితిని బాగానే వాడుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 31, 2022 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

21 minutes ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

23 minutes ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

46 minutes ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

47 minutes ago

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

3 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

5 hours ago