ఎంతైనా.. మన నాయకులు.. నాయకులే! ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వారు వదులుకునే పనేలేదు. ఈ క్రమంలో తాజాగా ఉప ఎన్నికకురెడీ అవుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వినాయచవితిని ఇక్కడ నాయకులు రాజకీయం చేసేశారు. యువతను సమీకరించడం నుంచి నాలుగు రోడ్ల కూడళ్లలో పందిళ్లు వేయడం వరకు.. ఉత్సవాల నిర్వహణ దాకా అంతా కూడా పొలిటికల్ మయం అయిపోవడం గమనార్హం.
వారు వీరు అనే తేడా లేకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు మునుగోడులో చవితి వేడుకలను రాజకీయం చేయడం గమనార్హం. గణేశ్ ఉత్సవాలు ప్రత్యేకించి యువత ఆధ్వర్యంలోనే ఎక్కువగా నిర్వహిస్తుండడంతో.. ఉప ఎన్నిక దృష్ట్యా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీలకు.. విగ్రహం కొనుగోలుకు అయ్యే మొత్తంతోపాటు నవరాత్రులు ముగిసేంత వరకు మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చునూ అధికార టీఆర్ఎస్ నేత ఒకరు అందజేస్తున్నారు.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం ఆయా మండపాల నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలో 150 వినాయక విగ్రహాల ఏర్పాటుకుగాను ఒక్కో కమిటీకి రూ.10 వేల చొప్పున టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ జరిగినట్లు తెలిసింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. దీంతోపాటు చౌటుప్పల్ మండలంలోని గ్రామాల్లోనూ 300 విగ్రహాలు, ఉత్సవాల నిర్వహణకు సైతం రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది.
మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్, మునుగోడు, నారాయణపురం మండలాల్లో టీఆర్ ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా మునుగోడు మండలంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈయన కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక బీజేపీ నేత రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా తమను కలిసిన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పండగ మీది.. ఖర్చు మాది.. అని నాయకులు.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు.. వినాయచవితిని బాగానే వాడుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 31, 2022 6:53 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…